Friday, 24 November 2017

మిథున‌............

మిథున కవితా వనం సభ్యులకు నమస్సుమాంజలులు...ఇంకొన్ని గంటల్లో శనివారం
వచ్చేస్తుంది.. శనివారం కవనతరంగిణికి స్వాగతం సుస్వాగతం........

ఆధునిక కవితా ప్రక్రియలకు పెద్దపీట వేసే కవనతరంగిణి మీ ముందుకు వచ్చింది......దీనిలో...

రుబాయీలు,
గజళ్ళు,.
నానీలు..
నానోలు.
హైకూలు.
రెక్కలు
ఏకపాదకవితలు,
ద్విపాదకవితలు,...
త్రి పాద కవితలు...
వచన కవితలు..
చిత్ర కవితలు
పద్యాలు...

మరి యే ఇతర ప్రక్రియ అయినా.....కవనతరంగిణికి రాసి పోస్టు చేయవలసిందిగా కోరుతున్నాను

ఈ రోజు స్త్రీ వాద సాహిత్యం గురించి, స్త్రీ వాద కవయిత్రులు రాసిన కొన్ని కవితలగురించి తెలుసుకుందాం...

ఆధునిక స్త్రీ వాద సాహిత్యం తెలుసుకోవడమంటే సముద్రపు లోతులను  వెతకడమే అని నా అభిప్రాయం..

ప్రాచీన కాలంలో తాళ్ళపాక తిమ్మక్క, మొల్ల ,రంగాజమ్మ వంటి కవయిత్రులున్నప్పటికీ, వారు భక్తితోనో, రాజుల కొరకో కవిత్వం రాసారు...

ఆధునికయుగంలో ముఖ్యంగా 1980 లో తరువాత  తెలుగు కవిత్వంలో స్ర్తీ వాద ధోరణులు ,వాటి ప్రభావంతో సమాజాన్ని ప్రభావితం చేసే కవిత్వం వచ్చింది....

ఆకాశంలో సగం అన్నట్లున్న స్త్రీలు వారి మానసిక వేదనలను కవిత్వీకరించడం మొదలయ్యింది.....1975-85
అంతర్జాతీయ మహిళా దశాబ్దం సందర్భంగా ప్రపంచమంతటా స్త్రీలు సమావేశాలు జరుపుకోవడం...తీర్మానాలు చేసుకోవడం...ఆ ప్రభావం తెలుగు సమాజంపై కూడా ప్రభావాన్ని చూపింది..

    ఆ సమయంలో  ఓల్గా, జయప్రభ, విమల, సావిత్రి...మొదలైన కవయిత్రులు స్త్రీ ల జీవితం సాఫీగా సాగకపోవడానికి కారణం పురుషాధిక్య సమాజమనీ, వారిని అన్ని విధాలుగా తక్కువగా చూడడం.మహిళలవేదనకు కారణమనీ...ఇదంతా రాజకీయమని...అది మహిళలు తెలుసుకోవలసిన అవసరముందనీ, వారు భావించి , ఆకోణంలో
...కవిత్వం రాసారు...

లో సావిత్రి ” బంది పోట్లు ” అనే కవిత రాసింది!

” పాఠం ఒప్పచెప్పక పోతే పెళ్ళిచేస్తానని
పంతులు గారన్నప్పుడే భయమేసింది !
ఆఫీసులో నా మొగుడున్నాడు
అవసరమొచ్చినా సెలవివ్వడని
అన్నయ్య అన్నప్పుడే అనుమాన మేసింది!

వాడికేం ? మగమహారాజని
ఆడా, మగా వాగినప్పుడే అర్థమై పోయింది
పెళ్ళంటే పెద్ద శిక్ష అని
మొగుడంటే స్వేచ్ఛా భక్షకుడని

మేం పాలిచ్చి పెంచిన జనంలో సగమే
మమ్మల్ని విభజించి పాలిస్తోందని! ”

సావిత్రి రాసిన ఈ పద్యం కన్నా ముందొచ్చిన రేవతీ దేవి కవిత్వంలో ఈ రకమైన గొంతు లేదు. ఒక అశాంతీ, దిగులు… అంతర్మథనం… చెప్పుకోలేని అసహనం… ఇవీ కన్పిస్తాయి ” శిలాలోలిత ” పుస్తకంలో! రేవతీదేవి ఇలారాస్తుంది….

” దిగులు
దిగులు దిగులుగా దిగులు
ఎందుకా
ఎందుకో చెప్పే వీలుంటే
దిగులెందుకు ” అని

సావిత్రి ” బందిపోట్లు ” లో ఈ గుంజాటన పడటం మరిలేదు. ఎందుకో చెప్పే వీలుంటే అన్న ఊగిసలాట లేదు. అదెందుకో చెప్పెయ్యటమే తప్ప!!

ఆశ్చర్యం ఏమిటంటే చేకూరి రామారావు గారు ప్రస్తావించేదాకా సావిత్రి రాసిన ” బంది పోట్లు ” విశేషంగా ఎవరి దృష్టినీ పడలేదు. ఇలా ఎంత మంది రాసినవి మరుగున పడిపోయినా వింత కూడా లేదు. సావిత్రి ” బందిపోట్లు ” అలాకాకుండా సాహిత్యానికి మిగలటం అదృ
ష్టంగా భావించాలి...

, వేల్చేరు నారాయణరావు ఆంధ్రజ్యోతి వారపత్రికలో వామనుడి మూడోపాదం పుస్తకాన్ని రివ్యూ చేస్తూ పై మూడు కవితలనీ తీసుకుని విశ్లేషించిన పద్ధతి వల్లనే ఈ కవితలు ఎక్కువ చర్చకి కారణం అయ్యాయి అన్నది! బహుశా నారాయణరావు గారు వామనుడి మూడోపాదాన్ని పునస్సమీక్షిస్తే తప్ప ఈ దోషం పోదనుకుంటాను. ఆ పుస్తకంలో ఇంకా ముఖ్యమైన కవితలున్నా రివ్యూదారులని ప్రధానంగా ఆకర్షించిన కవితలు పైన నేను చెప్పినవే! ఇందులో ” చూపులు ” అన్న కవిత  ఆడదాన్ని గాయపరచగల మగవాడి చూపులెలా ఉంటాయో… అవి ఆడవాళ్ళని ఎంతగా హింస పెడతాయో చెబుతుంది. ఈ కవితకి ఆడవాళ్ళు వయసులో చాలా పెద్ద వాళ్ళయిన ఆడవాళ్ళతో సహా, చాలా లీనమై స్పందించారు. ఇది ఇతర భాషలలోకి అనువాదమైంది..

” రెండు కళ్ళనించి చూపులు సూదుల్లా వచ్చి
మాంసపు ముద్దలపై విచ్చల విడిగా తిరుగుతుంటాయి
చూపులెప్పుడూ ముఖంలోకి చూడవు
మాట ఎప్పుడూ మనసు నించి పుట్టదు
కనిపించి నప్పుడల్లా కంపరం పుట్టేలా
వంటిమీద చూపులు చెదల్లా పాకుతూ ఉంటాయి

ఆ కళ్ళల్లో లక్ష వర్గాలున్నాయి
కానీ చూపులకి మాత్రం వర్గ విభేదాలు లేవు
ఆ చూపుల్లో ఎప్పుడూ ఒక్కటే సంకేతం ఉంటుంది
చొంగ కార్చే కుక్కలాంటి ఆకలుంటుంది
వికృతమయిన భల్లూకపు పట్టులాంటిదేదో విడవక
కలల్లో సైతం వెంటాడుతుంది

చిక్కని ఈ అడివిలో వెలుగుకీ చీకటికీ తేడానే ఉండదు.
చూపుల నించి దాటుకోవడానికి స్థలమనేదే ఉండదు.
రోడ్డుమీద… బస్సులోనూ…. క్లాసులోనూ
వేసే ప్రతి అడుగు వెనకా

శరీరంలోని ఏదో ఒక భాగాన్ని గాయం చేస్తూ
విషపు చూపులు గుచ్చుకుంటూనే ఉంటాయి
ఒక్కోసారి భయమేసి
సుదూర ఆకాశంలోకి శూన్యంలోకి
మాయమయి పోవాలనిపిస్తుంది
కానీ,
పలాయనం పరిష్కారం కాదని
విషపు చూపుల నెదుర్కొనే ముళ్ళలాంటి తీక్షణతని
కళ్ళకి నేర్పటం మొదలెట్టాను
ఇప్పుడు ఆ కళ్ళని వెంటాడటానికి
కళ్ళతోనే యుద్ధం చేస్తాను
సూటిగా రెండు క్షణాలు కళ్ళలోకి చూడలేని
పిరికి చూపులు
పాతాళం లోకి పారిపోతాయి

అప్పుడనుకుంటాను
కళ్ళకే కాదు
ఈ దేశంలోని ఆడదానికి
వళ్ళంతా ముళ్ళుండే రోజు
ఎప్పుడొస్తుందా అని!

   నీలిమేఘాలు  కవితా సంకలనం స్త్రీవాద కవితా సంకలనం..1995 ప్రాంతాల్లో సాహిత్యంలో సంచలనాన్ని కలిగించింది.....ఇందులోని అన్ని కవితలూ స్త్రీ శారీరక బాధలు మానసిక వేదనలు, సమాజంలోని స్త్రీ పురుష అసమానతలను చాటి చెప్పేవే..
మరి కొన్ని కవితలను వచ్చేవారం పరిశీలిద్దాం...

..................సశేషం...

ఈవారం కవనతరంగిణిని మీ అద్భుతమైన కవితలతో అలంకరిస్తారని ఆశిస్తున్నాను....

నాకు కవనతరంగిణి నిర్వహించడానికి అవకాశం ఇచ్చిన అడ్మిన్ శ్రీమతి లీల గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను...శీర్షికను ఉత్సాహవంతంగా  తమ కవితలతో రసభరితం చేస్తున్న సభ్యులందరికీ శుభాకాంక్షలతో......

మీ,

అడ్మిన్,

డా.శ్యామల గడ్డం...

Friday, 10 November 2017

శివారెడ్డి..

 మిథున కవితా వనం సభ్యులకు నమస్సుమాంజలులు...ఇంకొన్ని గంటల్లో శనివారం
వచ్చేస్తుంది.. శనివారం కవనతరంగిణికి స్వాగతం సుస్వాగతం........

ఆధునిక కవితా ప్రక్రియలకు పెద్దపీట వేసే కవనతరంగిణి మీ ముందుకు వచ్చింది......దీనిలో...

రుబాయీలు,
గజళ్ళు,.
నానీలు..
నానోలు.
హైకూలు.
రెక్కలు
ఏకపాదకవితలు,
ద్విపాదకవితలు,...
త్రి పాద కవితలు...
వచన కవితలు..
చిత్ర కవితలు
పద్యాలు...

మరి యే ఇతర ప్రక్రియ అయినా.....కవనతరంగిణికి రాసి పోస్టు చేయవలసిందిగా కోరుతున్నాను...

ఈ రోజు కవిత్వానికి మూడో కన్ను తెరిపించిన శివుడు ( శివారెడ్డి) కవిని గురించి తెలుసుకుందాం..

ఈరోజు శివారెడ్డి కవిని గురించి చెప్పడానికి ప్రత్యేకమైన కారణం ఉంది. తెలుగు వచన సాహిత్యంలో  నేడు ఎంతోమంది కవులకు మార్గదర్శకులు, కవిత్వంలో తప్పటడుగులు వేస్తున్న వారిని సైతం అక్కున చేర్చుకుని కవిత్వపు మెళకువలు నేర్పి,ప్రోత్సహించే కవి, కొత్తగా కవితా సంకలనాలు, సంపుటులు వేస్తున్న కవులు పుస్తకాలకు సైతం ముందుమాట రాసి,  వెన్నుతట్టే కవితాప్రియులు....నిరాడంబర జీవి....

..అలాంటి కవి ఈ రోజు కబీర్ సమ్మాన్ అవార్డు తీసుకుంటున్న మహత్తరమైన రోజు..

తెలుగు కవి, సాహిత్య అవార్డు గ్రహీత ఆచార్య కె. శివారెడ్డి సాహిత్య కృషికిగానూ ప్రతిష్ఠాత్మక జాతీయ పురస్కారం ‘‘కబీర్‌ సమ్మాన్‌’’ వరించింది. ఈ నెల 10న భోపాల్‌లో జరిగే సాహిత్య సభలో రాష్ట్రపతి చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును అందుకోనున్నారు. ఈ అవార్డును అందుకుంటున్న తొలి తెలుగు కవి శివారెడ్డి కావడం విశేషం. మొదటిసారి తెలుగుల కవిని ఈ అవార్డు వరించడంతో తెలుగు సాహితీవేత్తలు, సాహిత్యాభిమానులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. ‘ఆరు దశాబ్దాలుగా కవిత్వమే జీవితంగా బతుకుతున్న కె. శివారెడ్డి గారిని ఈ అవార్డు వరించడం
తెలుగువారందరికీ గర్వకారణం...

ముఖ్యంగా ఏ అవార్డులకోసమూ కవిత్వం రాయని కవి ఏ సన్మానాలు కోసమో ఆరాటపడని నిష్కల్మష, నిస్వార్ధ
కవి. ప్రజలతో నిరంతరం మమేకమవుతూ,ప్రజలు, మనిషి,మట్టి, శ్రమ ...ఇలాంటివి మాత్రమే వస్తువులుగా స్వీకరించి కవితా సంపుటులు వెలువరించిన కవి....