మిథున కవితా వనం సభ్యులకు నమస్సుమాంజలులు...ఇంకొన్ని గంటల్లో శనివారం
వచ్చేస్తుంది.. శనివారం కవనతరంగిణికి స్వాగతం సుస్వాగతం........
ఆధునిక కవితా ప్రక్రియలకు పెద్దపీట వేసే కవనతరంగిణి మీ ముందుకు వచ్చింది......దీనిలో...
రుబాయీలు,
గజళ్ళు,.
నానీలు..
నానోలు.
హైకూలు.
రెక్కలు
ఏకపాదకవితలు,
ద్విపాదకవితలు,...
త్రి పాద కవితలు...
వచన కవితలు..
చిత్ర కవితలు
పద్యాలు...
మరి యే ఇతర ప్రక్రియ అయినా.....కవనతరంగిణికి రాసి పోస్టు చేయవలసిందిగా కోరుతున్నాను...
ఈ రోజు కవిత్వానికి మూడో కన్ను తెరిపించిన శివుడు ( శివారెడ్డి) కవిని గురించి తెలుసుకుందాం..
ఈరోజు శివారెడ్డి కవిని గురించి చెప్పడానికి ప్రత్యేకమైన కారణం ఉంది. తెలుగు వచన సాహిత్యంలో నేడు ఎంతోమంది కవులకు మార్గదర్శకులు, కవిత్వంలో తప్పటడుగులు వేస్తున్న వారిని సైతం అక్కున చేర్చుకుని కవిత్వపు మెళకువలు నేర్పి,ప్రోత్సహించే కవి, కొత్తగా కవితా సంకలనాలు, సంపుటులు వేస్తున్న కవులు పుస్తకాలకు సైతం ముందుమాట రాసి, వెన్నుతట్టే కవితాప్రియులు....నిరాడంబర జీవి....
..అలాంటి కవి ఈ రోజు కబీర్ సమ్మాన్ అవార్డు తీసుకుంటున్న మహత్తరమైన రోజు..
తెలుగు కవి, సాహిత్య అవార్డు గ్రహీత ఆచార్య కె. శివారెడ్డి సాహిత్య కృషికిగానూ ప్రతిష్ఠాత్మక జాతీయ పురస్కారం ‘‘కబీర్ సమ్మాన్’’ వరించింది. ఈ నెల 10న భోపాల్లో జరిగే సాహిత్య సభలో రాష్ట్రపతి చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును అందుకోనున్నారు. ఈ అవార్డును అందుకుంటున్న తొలి తెలుగు కవి శివారెడ్డి కావడం విశేషం. మొదటిసారి తెలుగుల కవిని ఈ అవార్డు వరించడంతో తెలుగు సాహితీవేత్తలు, సాహిత్యాభిమానులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. ‘ఆరు దశాబ్దాలుగా కవిత్వమే జీవితంగా బతుకుతున్న కె. శివారెడ్డి గారిని ఈ అవార్డు వరించడం
తెలుగువారందరికీ గర్వకారణం...
ముఖ్యంగా ఏ అవార్డులకోసమూ కవిత్వం రాయని కవి ఏ సన్మానాలు కోసమో ఆరాటపడని నిష్కల్మష, నిస్వార్ధ
కవి. ప్రజలతో నిరంతరం మమేకమవుతూ,ప్రజలు, మనిషి,మట్టి, శ్రమ ...ఇలాంటివి మాత్రమే వస్తువులుగా స్వీకరించి కవితా సంపుటులు వెలువరించిన కవి....
No comments:
Post a Comment