సాయంత్రం వానజల్లు
చీకటిని దిగబెట్టి
వెళ్లిపోయింది,.
పక్షి నోటిలో
గడ్డి పరకలు
ఇల్లు మారుతున్నదేమో.,.
సుడిగాలి,
కొమ్మను ఊపుతున్నాని,
పిట్ట గర్విస్తుంది,.
సాయంత్రం వానజల్లు
చీకటిని దిగబెట్టి
వెళ్లిపోయింది,.
పక్షి నోటిలో
గడ్డి పరకలు
ఇల్లు మారుతున్నదేమో.,.
సుడిగాలి,
కొమ్మను ఊపుతున్నాని,
పిట్ట గర్విస్తుంది,.
కొలను లోకి రాయి విసిరారెవరో*
అలలు ఇ౦కా వ్యాపిస్తూనే ఉన్నాయి
రాయేదీ…
ఎవరికోస౦ వర్షిస్తాయి మేఘాలు
పిల్లల కోస౦ కాకపోతే
గొడుగులడ్డు పెట్టుకునే వాళ్ళకోసమా?
ము౦దు మనస్సునీ
ఆ వెనక గదినీ
తర్వాత విశ్వాన్నీ ఆవరి౦చి౦ది చీకటి.
పెన్నా శివరామకృష్ణ గారి హైకూలు కొన్ని,.
తెలుగులో మొట్టమొదటి సారి హైకూలను రాసిన కవిగా గాలి నాసర్ రెడ్డి గారిని చెప్పుకోవచ్చు, 17 అక్షరాల నియమం పాటించిన కవి బహుశా ఈయనోక్కరే,వీరు రాసిన హైకూలు చాలా తక్కువ.వారి హైకు ఒకటి,
ఎండుకొమ్మపై,
ఒంటరిగా ఓ కాకి,
శిశిర సంధ్య,.
అమెరికాలో హైకూలు 1950నుంచి విస్తృతమైన ప్రచారంలో వున్నాయి,కానీ అక్కడ అక్షరనియమం పాటించబడటం లేదు,.కొంత మంది కవులు ఒక్క పాదంలో, రెండుపాదాలలో కూడా హైకూలు రాస్తున్నారిప్పుడు,.గోపి గారి మాటలలో చెప్పాలంటే,హైకూస్నాప్ షాట్ లాగా, ఫోటోగ్రాఫిక్ గా వుంటుంది,.సగటు శ్రోతకు దీనిలో కదలక కనిపించదని ,పాఠకుడు కవితో పాటు సమభావకుడు అయినప్పుడు మాత్రమే హైకు ప్రకాశవంతమపుతుందని ,ఇవి తాత్వికత, ప్రకృతితో తాదాత్మ్యం లాంటి మౌనవస్తువులకు సరిపోతుంతని ,ఆయన భావించారు,.. అందుకేనేమో నానీల బాట పట్టారు,..ఇస్మాయిల్ గారి తెలుగు హైకూలను ప్రతిభావంతంగా రాశారు, వారి హైకూలు కొన్ని,.
22-04-2017...
ఎదురుచూపు ఇంకెన్నాళ్ళు?.. కవిత
ఎండమావిలో. ఎదురేచూసా
నీటి బిందువు కనబడునేమో
పులినస్థలి లో పరుగేతీసా
బాటవెంబడి బరువుగ కదిలా
ఎటుచూసినా ఎడారి...
నా నీడ బరువుగ తోచిందేమో
కడవెత్తుకుని కడలిని మోసా..
మళ్ళీ మళ్ళీ మరీచికలే...
ఇసుకరేణువుల వేడినితాకి.
పాదములేమో పర్రెలుబాసె
నీటిచుక్కకే అలమటించగ..
బుక్కెడుబువ్వ దొరికేదెట్లా?...
బారెడు దూరం సాగిన గానీ
చెలమ కలుములు కనపడవాయె..
అంబువుజాడ అసలే లేదు..
కన్నీరే నీరుగ తాగుటకంటే..
మార్గమేదియూ కనబడదాయె...
డా. శ్యామలగడ్డం...22-03-2017...
వృక్షమే జగతికి రక్ష
------------------------------
లేదు కొరత తరువుంటే
లేదు కొరత తరువుంటే
పచ్చనైన తోరణాలకు వృక్షం
పెళ్ళిళ్ళకు పందిరి వృక్షం
పరవశించే మనసుకు వృక్షం
పక్ష్యాదుల ఆవాసం వృక్షం
పక్షి గూడులకు వృక్షం
పర్యావరణ రక్షయె వృక్షం
చల్లనైన చిరు గాలికి వృక్షం
చక్కనైన మధుర ఫలములకు వృక్షం
చిగురాకులలో కోయిలమ్మకు వృక్షం
రహదారిలొ నీడకు వృక్షం
వర్షానికి కావలె వృక్షం
పొద్దునలేస్తే పొయ్యికి వృక్షం
కృూర జంతువుల నివాసమె వృక్షం
చిట్టెలుకల బొరియకు వృక్షం
చిట్టచివరకు,
మరణశయ్యకు కావలె వృక్షం
వృక్షం కల్ప తరువు, ,కామధేనువు
కామితార్ధ ప్రదాయిని
వృక్షం అక్షయపాత్ర ఆశాకిరణం
వృక్షం జగతికి రక్ష
హరితవనం మన బృందావనం
హరిత హారం భరతమాతకు
భక్తితో సమర్పించే సుమ హారం....---
డా. జి. శ్యామల--------05-07-2015
హృద్య భావధార పద్యతరంగిణి
సరళ జాను తెనుగు సొంపు మీర
సరసమైన భావ రస ప్రవాహముపెంపు
కనగ మిథున వనము పరిమళించు
హృద్య భావధార పద్యతరంగిణి...
పద్య మొకటి రాయ తొందరించు...
మిథున వనము సుమము పాదముల కొరకు
పదును గల పదములు వెదకు చుంటి
నింగిలోన జాబిల్లిని నీ మోమే అనుకున్నా,నీలి తెరల మబ్బుల్నినీ కురులే అనుకున్నా
మబ్బు వెనుక మెరుపుల్నినీ కన్నులె అనుకున్నా, చల్లగాలి సాకిడిని నీ స్పర్శే అనుకున్నా
ఆకసాన తారకల్ని నీ చూపులె అనుకున్నా. సాగరాన తరగల్ని నీ నవ్వులె అనుకున్నా అను
వనంలోని నెమలిని గని నీ నాట్యమె అనుకున్నా, గంగలోని హంసనిగని నీ నడకలె అనుకున్నా
పారే కిమ్ెరసానిని కని నీ హొయలే అనుకున్నా, రవివర్మ చిత్తరువును కని నీ బొమ్మే అనుకున్నా
కోయిలమ్మ పాటను విని నీ గళమే అనుకున్నా, చిలకమ్మ పలుకులను విని నీ మాటలె అనుకున్నా
ఊగుతున్న పైరును కని నీ కొంగే అనుకున్నా, పరవశించు వ్రకృతికాంతవు నీవేనని అనుకున్నా------------డా..శ్యామల--
ముషాయిరా గజల్...
++++++++++++++++
మనసుతో పలికేటి మాటల్ని గమనించు
పెదవులతొ పలికేటి పలుకుల్ని గమనించు
గుండెలో ప్రేమనూ పంచుమా హాయిగా
తీయనీ పలుకులో వెలుగుల్ని గమనించు
మౌనమే రాగము, మౌనమే గానమూ
గొడవల్లొ తగిలిన గాయాల్ని గమనించు
తలగడలె సడిసేయక తెలుపునులె బాధలనూ
. ఉషస్సు లొ పరిమళించు సొగసుల్ని గమనించు..
.శ్యామశ్రీ మదిలోన తుషారం నీవైతె
చిరునవ్వు దివ్వెలలో మెరుపుల్ని గమనించు
డాక్టర్.. శ్యామల గడ్డం...........08-04-2017..
రచన .. డాక్టర్.శ్యామల గడ్డం...
++++++++++. ...08-04-2017....
చిలిపి నవ్వులే విరియకపోతే జీవితమందున వెలుగే ఉండదు..
ప్రకృతి కాంతయే పులకించకనే ఇలలో పుడమికి తడియేఉండదు..
అరుణకాంతులూ చిందకపోతే జలజవికాసము మెరుపే లేదులె
వసంత కోకిల పాడకపోతే ఋతువునకందము అసలేఉండదు...
రాతిరి వెన్నెల పిండు కురియగా చకోర పక్షులు సంతసమందును
ధవళకాంతులూ నిండినంతనె కలువకళికలకు అలుపేఉండదు....
ఉషోదయానా ఇనబింబమును చూచినంతనే చేతనమొసగును...
వడివడిపరుగూ తీసినంతనే మనసున బధ్ధకమసలే ఉండదు..
శ్యామ నగవులే చిరుకానుకలూ అనుకొనినువ్వూ సాగిపోవగా
వినయమె నయమూ ధృతియే పథ్యం .విజయమెతథ్యం తిమిరమె ఉండదు...
డాక్టర్.శ్యామలగడ్డం.....