Wednesday, 22 August 2018

అక్షర సమస్యాపూరణం...

అక్షర సమస్యా పూరణం...డా.శ్యామలగడ్డం..21-08-2018...
±++++++++++++++++++++++++++++++++++++++

జలప్రళయము సంభవించె కేరళమునందునను
వరదలందున సర్వము పోగొట్టుకొనిరి జనులు,
ముక్కంటి  తలచుకొనగ  ఆదుకొనుహస్తములను
వరదవచ్చి జనులకెల్ల వరములొసగునట!

పద్యం...దత్తపది...వర్ణన...

జలవిలయము...వర్ణన...

ఆ.వె.  జలము ప్రాణ ధార జనులకు యెంచగా,
          కలము  కత్తి యౌను కవుల యెదకు,
         జలవిలయము కలుగగ,జాలి గొలుపగను..
          ప్రజలు  మౌను లయిరి పలుకు లేక!

వర్ణన....జలవిలయము....22-08-2018...డా.శ్యామల..



తెలుగు సాహిత్య సుధాంబుధి....వారు ఇచ్చిన దత్తపది...

దత్తపది...గంగ, యమున, గోదావరి, కృష్ణ ...
22-08-2018...రచన,  డా.శ్యామల  గడ్డం...

దత్తపది....

  తే.గీ. భవుని కృప చేత  దిగినది  భవ్య గంగ
           యముని చెల్లెలై అలరారి యమున వెలసె..
            నాసికమ్ము  గోదావరి నామ పుట్టె
             పంట లొసగగ కృష్ణమ్మ  పరుగులిడెను..!

డా.శ్యామల...22-08-2018...