Wednesday, 28 June 2017

తిలక్..


దేవరకొండ బాలగంగాధర తిలక్ (1921-1966) ఒక ఆధునిక తెలుగు కవి. భావుకత, అభ్యుదయం ఇతని కవిత్వంలో ముఖ్య లక్షణాలు. భావ కవులలొ అభ్యుదయ కవీ, అభ్యుదయ కవులలో భావకవీ అయిన తిలక్ పూర్తి పేరు దేవరకొండ బాలగంగాధర తిలక్ . ఇతను కవి, కథకుడు, నాటక కర్త. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు తాలుకా మండపాక గ్రామంలో 1921 ఆగష్టు 1 న తిలక్ జన్మించాడు.తిలక్ ఎంత సుకుమారుడో అతని కవిత అంత నిశితమైనది . భాష ఎంత మెత్తనిదో, భావాలు అంత పదునైనవి. సంఘ వంచితుల పట్ల ఎంత కారుణ్యమో , సంఘ దురన్యాయాలపట్ల అంత క్రోధం. తిలక్‌కు తెలుగు, ఇంగ్లీషులలో చక్కని పాండిత్యం వుంది. ప్రాచీనాధునిక పాశ్చాత్య సాహిత్యంలో చాలా భాగం అతనికి కరతలామలకం. అయినా, తెలుగు వచనం గాని, పద్యంగాని ఎంతోబాగా వ్రాసేవాడు. సుతిమెత్తని వృత్త కవితతో ప్రారంభించినా, ఆధునిక జీవితాన్ని అభివర్ణించడాని వృత్త పరిధి చాలక వచన గేయాన్ని ఎన్నుకున్నడు. అది అతని చేతిలో ఒకానొక ప్రత్యేకతను, నైశిత్యాన్ని సంతరించుకుంది, సౌందర్యాన్ని సేకరించుకుంది.

వచన కవితా పాదాలు......

నా అక్షరాలు కన్నీటి జడులలో తడిసే దయాపారావతాలునా అక్షరాలు ప్రజాశక్తుల వహించే విజయ ఐరావతాలునా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు[1]చరిత్ర రక్త జలధికి స్నేహ సేతువును నిర్మిస్తున్నాను రండి..దేవుడా! రక్షించు నాదేశాన్ని పవిత్రులనుండి, పతివ్రతలనుండి, పెద్దమనుషుల నుండి, పెద్దపులులనుండి....

Nil

తిలక్

Hello, Guest!Login

దేవరకొండ బాలగంగాధర తిలక్

పశ్చిమ గోదావరి జిల్లా తణుకు తాలుకా మండపాక గ్రామంలో 1921 ఆగష్టు 1 న జననం. 1966 జూలై 1 న మరణం.

'అమృతం కురిసిన రాత్రి' ఉత్తమ కవితాసంపుటిగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు 1971 లో పొందింది.

తిలక్ అనగానే గుర్తొచ్చేది... అమృతం కురిసిన రాత్రి. తిలక్ పేరు తలచుకోగానే 'నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు' అన్న వాక్యం స్ఫురించకతప్పదు. తిలక్ కవిగానే కాదు, కథకుడిగా కూడా తనదైన ముద్ర వేసారు. తిలక్ మద్రాస్ లయోలా కాలేజిలోనూ, విశాఖ ఎ.వి.ఎన్. కాలేజిలోనూ ఇంటర్ చదువుతూ, అనారోగ్య కారణాల వల్ల ఆపేసారు. తణుకులో విజ్ఞాన పరిషత్ స్థాపించారు. తర్వాతి కాలంలో దానినే 'సాహితీ సరోవరం'గా మార్చారు. తిలక్ కవితలు, కథలే కాదు, నాటకాలు కూడా రాసారు. బృందావన కళా సమితి అనే సంస్థని స్థాపించి నాటకాలు వేయించారు. మన కళ్ళ ఎదుట ప్రతి నిత్యం జరిగిపోతున్న జీవిత నాటకాన్ని ప్రతిబింబించడానికి ఆయన కవితను, కథలను, నాటికా ప్రక్రియను ఉపయోగించుకున్నారు. రోజూవారీ జీవితంలో మనకు తారసపడే అభాగ్యులను, మోసగాళ్లను ఆయన పాత్రలుగా తీసుకుని అసలు రూపాలతో మన ముందు నిలబెట్టారు. తిలక్ తన మొదటి కథని 11 వ ఏట రాసారు. 'మాధురి' పత్రికలో ప్రచురితమైన ఆ కథ ఇప్పటికీ అలభ్యం. ఆయన 16 ఏళ్ళకే రాసిన పద్యాలు, గేయాలు 'ప్రభాతము - సంధ్య' పేరుతో 1938లో తొలి సంపుటిగా వచ్చింది. గోరువంకలు, కఠినోపనిషత్తు, అమృతం కురిసిన రాత్రి ఇతర కవితా సంకలనాలు. తిలక్ మరణానంతరం కుందుర్తి ఆంజనేయులు పీఠికతో 1968లో ముద్రణ పొందిన తిలక్ కవితల సంపుటి ' అమృతం కురిసిన రాత్రి ' ఉత్తమ కవితాసంపుటిగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు 1971 లో పొందింది. తిలక్ కథలు, సుందరీ-సుబ్బారావు, ఊరి చివరి యిల్లు తిలక్ కథా సంకలనాలు. సుశీల పెళ్లి, సుప్త శిల, సాలె పురుగు తిలక్ రాసిన నాటకాలు. 1956-66 మధ్య కాలం తిలక్ రచయిత శిఖరారోహణ చేసిన కాలం.

Books from Author: Devarakonda Balagangadhara Thilak

అమృతం కురిసిన రాత్రి

- Devarakonda Balagangadhara Thilak

₹108

తిలక్ కథలు 1

- Devarakonda Balagangadhara Thilak

₹60

amṛtaṃ kurisina rātri

- Devarakonda Balagangadhara Thilak

₹108

గోరువంకలు

- Devarakonda Balagangadhara Thilak

₹60

Next →

Login to add a comment

 Subscribe to latest comments

ePublish your bookHelp

ద్విపదలు...

ద్విపద మాలికలు....28-06-2017..
-----_-----++--------------------------+++

ప్రతి ఇంటిలో ప్రేమ ప్రతిఫలించాలి
తొలిపల్కు ఇంటింట తెలుగు కావాలి

ప్రతి ఇంటిలో ప్రేమ ప్రతిఫలించాలి.
అనురాగ గీతాలు ఆలపించాలి..

ప్రతి ఇంటిలో ప్రేమ ప్రతి ఫలించాలి.
స్వరరాగ మధురిమ శ్వాస కావాలి

మమతానుబంధాలు. మంచి కూర్చాలి
మాటల్లొ  నిపుణత మంచి చేయాలి..

డాక్టర్.శ్యామలగడ్డం....

Wednesday, 21 June 2017

తండ్రి...

తండ్రి యనిన తరగని ధనము కాద
తండ్రి ఆలన, పాలన దండి యన్న....
మాట కఠినము నుండును, మనసు వెన్న..
కరము చూపును గొప్పగ కరుణ  మెండు....

Wednesday, 14 June 2017

కిన్నెరసానిపాటలు...

కిన్నెరసాని పాటలు

కిన్నెరసాని పాటలు కవిసమ్రాట్‌ విశ్వనాథ సత్యనారాయణచే రచింపబడిన గేయకావ్యము.

కల్పనకిన్నెర పుట్టుకకిన్నెర నడకలుకిన్నెర నృత్యముకిన్నెర సంగీతముకడలి పొంగుకిన్నెర దుఃఖముగోదావరీ సంగమముకిన్నెర వైభవము

నేపథ్యము.....

గోదావరిలో కలిసిపోయే ఒక వాగు కిన్నెరసాని. కవి ఈ వాగును ఒక గొప్పంటి గృహిణిగా ఊహిస్తున్నాడు. ఆమెకు కూడా అత్తాకోడళ్ళపోట్లాట తప్పింది కాదు. భర్త మీద ప్రేమను ఒదులుకోక అత్తమీద పెత్తనం చలాయించలేక ఏమీ చేయలేని ప్రియుడ్ని వదలి కోపంతో కిన్నెర అడవుల వెంట పరుగెడుతుంది. తన ప్రియురాల్ని వెదుకుతూ తుదకు ప్రేమతాపంతో ఇద్దరూ కలుసుకొని ఒకరి ఎడబాటును ఇంకొకరు సహించలేకపోతారు. అపుడు అతను శోకించి శోకించి ఆమెను విడిచి కొండగా (రాయి)మారతాడు. ఆ సమయంలో కిన్నెరసాని తొడిమలేని పువ్వులా, మిక్కిలి సిగ్గుగల రాచకన్నెలా, కాంతిలేని రత్నంలా నడుస్తుంది. రాయిలా పడివున్న భర్తను విడువలేక సాగుతుంది కిన్నెరసాని వగపు తీగలా తిరుగుతుంది. తాను కూడా రాయిని కాలేక నదిని అయినందుకు లోలోపల దిగులు చెందుతుంది. విషాద గీతికల్లా శబ్దం చేస్తూ నడుస్తుంది. ఒకచోట నిలబడలేక అటుఇటు ఉరుకుతుంది. పోనీ తిరిగి కిన్నెరసానిగా ప్రవహించ వలెనని భావిస్తుంది. ఆ కోరిక ఆవహించగా తనను విడిచి భర్త ఉండలేడని, ఇక చెలిమి లేదని తలపోస్తుంది. అటువంటి భర్తతో కాపురం లేనందుకు వగస్తుంది, ఏడుస్తుంది కిన్నెరసాని. జలదేవతలు వచ్చి కిన్నెరసానిని పదమని బలవంత పెట్టగా పతిని వదలలేక వదలలేక కదలిపోతుంది. కిన్నెరసానిని చూచి కడలిరాజు మోహించి ఉప్పొంగుతాడు. కిన్నెరసాని తను తొందరపాటును, తెలివితక్కువ తనాన్ని తలచుకుని భోరున విలపిస్తుంది. ఆమె ఏడుపును చూసి అడవిలోని ఎలుగులు, పులుగులు, మృగములు, గాలులు రోదిస్తాయి. ఈ వార్త విని గోదావరి కరిగిపోయి తన కెరటాలను చాచి కిన్నెరసానిని ఆదుకుని కడలిరాజు నీ జోలికి రాడు అని అభయమిస్తుంది. గోదావరీనది ఆశ్రయంలో కిన్నెరసాని తిరిగి తన వైభవాన్ని సంతరించుకుంటుంది.......

శ్రీమద్రామాయణ కల్ప వృక్షం వంటి ప్రౌఢ పద్య కావ్య నిర్మాత విశ్వనాథ జానపదుని అవతారమెత్తి జానపద పాటలా అన్నంతగా కిన్నెరసాని పాటల్ని తెలుగు పలుకుబడి అనే అందచందాల వేదికపై గాయకుడై గానం చేశా రు. ఆధునిక సమాజానికి ఆయన భావజాలం అవసరం లేదుగాని.. ఆయన కవిత్వ ఇంద్రజాల ఉన్నత ప్రదర్శనలు అందరికీ అవసరమే. అలాంటి కవితా ప్రదర్శన కిన్నెరసాని పాటలు, సాహిత్య సభల్లో ఆయన రామాయణ కల్పవృక్ష పద్యాలు వినిపించడానికి వస్తే మాకు కిన్నెరసాని పాటలు వినిపించండి అని ప్రజలు కోరేవారంటేనే వారెవ్వా ఆ పాటల మజా గ్రహించవచ్చు. లయబద్ధ పదాలు సుళ్లు తిరుగుతాయి. భావాలు ఎక్కడికో తీసుకుపోతాయి. వాక్యాలు రసరమ్యాలౌతాయి. పాఠకుడు లేక శ్రోత గోదావరిని సంగమించే కిన్నెరగా మారి పోయే రసస్థితి.

గోదావరి జాలి గుండె గూడులు కదలి/
సాదుకిన్నెరకెదురుపోయీ/
ఆమె-లోదిగులు తరగ చేదోయీ.
ఇలా సాగుతుందా కిన్నెరసానిని గోదారి ఆ ప్యాయంగా తనలో కలవడానికి ఆహ్వానిస్తుంది.

గోదావరి పేద గుండె లోతులు కలిగి.../
గోదావరి జాలిగుండె ప్రేగులు తడిసి.../
గోదావరి ఎడ ద కోసలను కోతపడి../
గోదావరి దేవి కోసమనసులో వొరసి/
కిన్నెరసానిని పిలిస్తే ఆమె వచ్చి కలుస్తుంది.
ఆదుకొను, పాదుకొను, తలిరుమల్లికలు, పొలుచుటలు/
కోరగించుటలో ఇటువంటి తెలుగు మాటల ప్రయోగాల్లో కిన్నెరసాని గోదావరిలో కలిసిపోతుంది.
 గోదావరి దేవి గొప్ప వంశపు రాణి అని, ఆమె ఏమ న్నా కాదనేందుకు వీల్లేదని, అసలు ఆమె కాదంటే ఏ పనీ చేయరాదని భావించింది కిన్నెరసాని నీటిదొరసానిగా. గోదావరి కిన్నెర కలసిపోయాక సమ్మేళనమైన జలం.
 
గోదావరి నీరు కూడి కిన్నెర నీరు/ఏది ఏదో తెలియనంతగా మారిపోయిందట. గోదావరి దేవిని కిన్నెరసాని కూడిన తర్వాత కిన్నెరసానికి దిగులే లేదట. ఏదైనా దిగులున్న ఎడదలున్న వారెవరైనా కిన్నెరసాని పాటలు చదువుతుంటే, పాడుకుంటే ఆనందం అర్ణవమవుతుంది వేవేల వర్ణాల వర్ణనా శోభతో.

Tuesday, 13 June 2017

మనిషి మార్పును కోరిన మాన్యుడతడు
మనిషి తనమును చూపిన  మర్మయోగి..
మాట నేర్పును మన్నన సాటి ఏది
వాసిగన్న విశ్వంభర మా సి..నా.రె.

డాక్టర్.శ్యామలగడ్డం..13-06-2017

Thursday, 8 June 2017

వానచినుకు...గజల్......

గజల్ పూరణం... డాక్టర్.శ్యామలగడ్డం..02-06-2017..

±++++++++++

గాలిలోన నాట్యమాడి కదులుతుంది వానచినుకు
తరగలలో ఒక్కటిగా సాగుతుంది వానచినుకు

మొక్కజొన్న పొత్తులోన హారముగా  మెరిసినట్లు
కరిమబ్బుల అంచులలో.  జారుతుంది వానచినుకు....

నిరుపేదల రైతన్నల ఎదురుచూపు చినుకుకొరకు
నీలిమబ్బు     కరుణించీ కురుస్తుంది వానచినుకు.

మొయిలు చూసి మయూరాలు పురివిప్పీ ఆడినాయి.
భూమాతయె వేచిఉండ రాలుతుంది వానచినుకు

నీలిమేఘ శ్యాముడినీ వరమిమ్మని కోరుతుంది..
కోరిన ఫలమందీయగ   చిందుతుంది వానచినుకు.

డాక్టర్.శ్యామల గడ్డం...02-06-2017..

Wednesday, 7 June 2017

సత్తెకాలపు నా యెంకి” సూటిగా, నేరుగా, నీటుగా మన ఎదతో, మదితో పలుకుతుంది : “నీతోటే వుంటాను నాయుడు బావా ! నీ మాటే యింటాను నాయుడు బావా ! సరుకులేమి కావాలె సంతన పిల్లా?” ……………………….. నీ నీడలోనే మేడ కడతా నాయుడు బావా!” నాగరికత చాయ యింకా ఎంకి – నాయుడు బావల మీద పడలేదు. వాళ్ళ బంధం, బలం పరస్పర విశ్వాసం. అరమరికలు లేకపోవటానికి వాళ్ళ పరిస్థితి సంకేతం, బాహ్యరూపం, దైనందిన జీవితం, విశ్వాసం ఒక దాన్ని యింకొకటి పెనవేసుకొని వుంటయ్. ఈ పెనవేసుకొని వుండటానికి నాగరికత ఎంతో దూరం కదా! అందుకనే కవి నాయుడుబావ పరంగా “సత్తెకాలపు నా యెంకి” అంటాడు. ఈ గేయం ద్వారానూ, యిటువంటి యితర గేయాల ద్వారానూ కవి పల్లె జీవితానికి, నాగరికతకి మధ్య నున్న దూ

ొ3. సత్తెకాలపు నా యెంకి” సూటిగా, నేరుగా, నీటుగా మన ఎదతో, మదితో పలుకుతుంది :

“నీతోటే వుంటాను నాయుడు బావా !
నీ మాటే యింటాను నాయుడు బావా !
సరుకులేమి కావాలె సంతన పిల్లా?”
………………………..

నీ
నీడలోనే మేడ కడతా నాయుడు బావా!”

నాగరికత చాయ యింకా ఎంకి – నాయుడు బావల మీద పడలేదు. వాళ్ళ బంధం, బలం పరస్పర విశ్వాసం. అరమరికలు లేకపోవటానికి వాళ్ళ పరిస్థితి సంకేతం, బాహ్యరూపం, దైనందిన జీవితం, విశ్వాసం ఒక దాన్ని యింకొకటి పెనవేసుకొని వుంటయ్. ఈ పెనవేసుకొని వుండటానికి నాగరికత ఎంతో దూరం కదా! అందుకనే కవి నాయుడుబావ పరంగా “సత్తెకాలపు నా యెంకి” అంటాడు. ఈ గేయం ద్వారానూ, యిటువంటి యితర గేయాల ద్వారానూ కవి పల్లె జీవితానికి, నాగరికతకి మధ్య నున్న దూరాన్ని భావగర్భితంగా

.

2. ఎంకి పాటలు లోని గేయాలు వైవిధ్యాన్ని, ఏకత్వాన్ని సమంగా సంతరించుకున్నాయ్. “ప్రతివారి గుండెలలోనుంచి సూటిగా, వెచ్చగ ప్రవహిస్తయ్.” చక్కని, చిక్కని తెలుగు పల్లెపదాలతో ఎంకిని చిత్రిస్తారు నండూరి.

కూకుండ నీదురా కూసింతసేపు
…………………………
నాకాసి సూస్తాది నవ్వు నవ్విస్తాది,
యెల్లి మాటాడిస్తే యిసిరికొడతాది!
………………………….
కన్ను గిలిగిస్తాది నన్ను బులిపిస్తాది,
దగ్గరగ కూకుంటే అగ్గి సూస్తాదీ!

ఆమె అమాయకత్వం, అల్లరి చేష్టలు, నాయుడుబావతో ఆమె అనుభవించే ఏకత్వం చదువరులను, శ్రోతలను ముగ్ధులను చేస్తయ్ :

జాము రేతిరి యేళ జడుపూ గిడుపూ మాని
సెట్టు పుట్టా దాటి సేనులో నేనుంటే
మెల్లంగా వస్తాది నా యెంకీ !
సల్లంగా వస్తాది నా యెంకీ !
……………………..
సెందురుణ్ణీ తిట్టు నాయెంకీ !
సూరియుణ్ణీ తిట్టు నాయెంకీ

  1.  నండూరి వారు “ఎంకి”ని సృష్టించి ఎనభై ఏండ్లు నిండాయి. అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ ఎంకి వయస్సు ఇరవై ఏండ్లే.
ఎప్పటికీ నిండు జవ్వని ఎంకి.

ఎంకి వంటి పిల్ల లేదోయి లేదోయి
మెళ్ళో పూసల పేరు
తల్లో పూవుల సేరు
కళ్ళెత్తితే సాలు:
రాసోరింటికైనా
రంగు తెచ్చే పిల్ల.
పదమూ పాడిందంటె
కతలు సెప్పిందంటె
కలకాలముండాలి.
అంసల్లె, బొమ్మల్లె
అందాల బరిణల్లె
సుక్కల్లె నా యెంకి

అంటూ ఎంకిని సృష్టించారు నండూరి వారు.

ఎంకి పాటలు పుస్తకం మొదట్లో

Tuesday, 6 June 2017

పద్యం...

. పద్యతరంగిణి.... మిథున కవితా వనం.......06-06-2016 డాక్టర్ శ్యామల గడ్డం
.

నగరబడులయందు, నాస్తి తెలుగు పల్కు.
    పల్లె బడులయందు పాతబడియె

      మమ్మి డాడి యనగ మాటలాడగ  ముర్సి
              ఇంగిలీసునునేర్చు ఎటులనైన

పరభాష యనసంత పరవశమేలనో
   అమ్మ భాషను మించు అందమేది

మందార మకరంద మాధుర్యమనుమాట
      తేట తెలుగు మాట తీయనెంతొ

ఆ.వె. తల్లి తండ్రి తోడ చెల్లి బావల తోడ
          బడులయందు, మరియు గుడులయందు
          మాటలాడ వలయుమరువక మనభాష
          మాతృఋణము వలెను తీరు ఋణము..

డాక్టర్ శ్యామల గడ్డం.......06-06-2017..
నగరబడులయందు, నాస్తి తెలుగు పల్కు.
    పల్లె బడులయందు పాతబడియె

      మమ్మి డాడి యనగ మాటలాడగ  మురువుదు
              ఇంగిలీసు నేర్చు ఎటులనైన

పరభాష యన్న  పరవశమొందుదువదేల.
     మాతృభాషకన్న మిన్న యేది?

మందార మకరంద మాధుర్యమనుమాట
      తేట తెలుగు మాట తీపి చెరకు

ఆ.వె. తల్లి తండ్రుల తోడ చెల్లి బావల తోడ
          బడులయందు, మరియు గుడులయందు
          మాటలాడగ వలయుమరువక మనభాష
          మాతృఋణము వలెను తీరు ఋణము..

డాక్టర్ శ్యామల గడ్డం.......06-06-2017..

Saturday, 3 June 2017

గజల్..03-06-2017

.గజల్.03-06-2017...డా.శ్యామలగడ్డం...

పసిపాపల బోసి నవ్వు  మనసులోకి చేరుతుంది..
వసివాడని పువ్వందం   కంటిలోకి చేరుతుంది..

పడతి లోని  సౌందర్యం  కవులమనో వీధిపైన..
కదలాడుతు కావ్యంగా కలలలోకి చేరుతుంది

కడలిలోని నీరంతా  నింగిలోకి చేరుకుంది
ప్రేమతోని వానజల్లు పుడమిలోకి చేరుతుంది..

తీరమెగసి అలలకన్య తీగలాగ.  అల్లుకుంటె..
పులిన స్థలి కరిగికరిగి  నీటిలోకి చేరుతుంది...

వెన్నెలెంత   తాగిందో.   చకోరమే   అలసిందీ
నీలిమేఘ శ్యాముని కని  నిదురలోకి చేరుతుంది..

డాక్టర్.శ్యామలగడ్డం....03-06-2017

Thursday, 1 June 2017

కాళోజీ..

ఎరుగుదువా నేస్తం
ఎన్ని మొద్దు బ్రతుకుల
ముద్దులు ముచ్చట్లు
రంపపు కోతల పాలైతే
మన ముద్దు ముచ్చట్లు

ఆటవెలది..

.

ఆటవెలది..భావ గీతి...పద్య.  సంవాదం...30-05-2017

ముద్దుగుమ్మ నడిచె మువ్వల సవ్వడి..
మనసు దోచ హాయి  మధురిమలతొ.
మాట రాని నోట మంచును కురియగ
మనో వీధి మెరసె  మధుర తార!!!

డాక్టర్.శ్యామల గడ్డం