Wednesday, 14 June 2017

కిన్నెరసానిపాటలు...

కిన్నెరసాని పాటలు

కిన్నెరసాని పాటలు కవిసమ్రాట్‌ విశ్వనాథ సత్యనారాయణచే రచింపబడిన గేయకావ్యము.

కల్పనకిన్నెర పుట్టుకకిన్నెర నడకలుకిన్నెర నృత్యముకిన్నెర సంగీతముకడలి పొంగుకిన్నెర దుఃఖముగోదావరీ సంగమముకిన్నెర వైభవము

నేపథ్యము.....

గోదావరిలో కలిసిపోయే ఒక వాగు కిన్నెరసాని. కవి ఈ వాగును ఒక గొప్పంటి గృహిణిగా ఊహిస్తున్నాడు. ఆమెకు కూడా అత్తాకోడళ్ళపోట్లాట తప్పింది కాదు. భర్త మీద ప్రేమను ఒదులుకోక అత్తమీద పెత్తనం చలాయించలేక ఏమీ చేయలేని ప్రియుడ్ని వదలి కోపంతో కిన్నెర అడవుల వెంట పరుగెడుతుంది. తన ప్రియురాల్ని వెదుకుతూ తుదకు ప్రేమతాపంతో ఇద్దరూ కలుసుకొని ఒకరి ఎడబాటును ఇంకొకరు సహించలేకపోతారు. అపుడు అతను శోకించి శోకించి ఆమెను విడిచి కొండగా (రాయి)మారతాడు. ఆ సమయంలో కిన్నెరసాని తొడిమలేని పువ్వులా, మిక్కిలి సిగ్గుగల రాచకన్నెలా, కాంతిలేని రత్నంలా నడుస్తుంది. రాయిలా పడివున్న భర్తను విడువలేక సాగుతుంది కిన్నెరసాని వగపు తీగలా తిరుగుతుంది. తాను కూడా రాయిని కాలేక నదిని అయినందుకు లోలోపల దిగులు చెందుతుంది. విషాద గీతికల్లా శబ్దం చేస్తూ నడుస్తుంది. ఒకచోట నిలబడలేక అటుఇటు ఉరుకుతుంది. పోనీ తిరిగి కిన్నెరసానిగా ప్రవహించ వలెనని భావిస్తుంది. ఆ కోరిక ఆవహించగా తనను విడిచి భర్త ఉండలేడని, ఇక చెలిమి లేదని తలపోస్తుంది. అటువంటి భర్తతో కాపురం లేనందుకు వగస్తుంది, ఏడుస్తుంది కిన్నెరసాని. జలదేవతలు వచ్చి కిన్నెరసానిని పదమని బలవంత పెట్టగా పతిని వదలలేక వదలలేక కదలిపోతుంది. కిన్నెరసానిని చూచి కడలిరాజు మోహించి ఉప్పొంగుతాడు. కిన్నెరసాని తను తొందరపాటును, తెలివితక్కువ తనాన్ని తలచుకుని భోరున విలపిస్తుంది. ఆమె ఏడుపును చూసి అడవిలోని ఎలుగులు, పులుగులు, మృగములు, గాలులు రోదిస్తాయి. ఈ వార్త విని గోదావరి కరిగిపోయి తన కెరటాలను చాచి కిన్నెరసానిని ఆదుకుని కడలిరాజు నీ జోలికి రాడు అని అభయమిస్తుంది. గోదావరీనది ఆశ్రయంలో కిన్నెరసాని తిరిగి తన వైభవాన్ని సంతరించుకుంటుంది.......

శ్రీమద్రామాయణ కల్ప వృక్షం వంటి ప్రౌఢ పద్య కావ్య నిర్మాత విశ్వనాథ జానపదుని అవతారమెత్తి జానపద పాటలా అన్నంతగా కిన్నెరసాని పాటల్ని తెలుగు పలుకుబడి అనే అందచందాల వేదికపై గాయకుడై గానం చేశా రు. ఆధునిక సమాజానికి ఆయన భావజాలం అవసరం లేదుగాని.. ఆయన కవిత్వ ఇంద్రజాల ఉన్నత ప్రదర్శనలు అందరికీ అవసరమే. అలాంటి కవితా ప్రదర్శన కిన్నెరసాని పాటలు, సాహిత్య సభల్లో ఆయన రామాయణ కల్పవృక్ష పద్యాలు వినిపించడానికి వస్తే మాకు కిన్నెరసాని పాటలు వినిపించండి అని ప్రజలు కోరేవారంటేనే వారెవ్వా ఆ పాటల మజా గ్రహించవచ్చు. లయబద్ధ పదాలు సుళ్లు తిరుగుతాయి. భావాలు ఎక్కడికో తీసుకుపోతాయి. వాక్యాలు రసరమ్యాలౌతాయి. పాఠకుడు లేక శ్రోత గోదావరిని సంగమించే కిన్నెరగా మారి పోయే రసస్థితి.

గోదావరి జాలి గుండె గూడులు కదలి/
సాదుకిన్నెరకెదురుపోయీ/
ఆమె-లోదిగులు తరగ చేదోయీ.
ఇలా సాగుతుందా కిన్నెరసానిని గోదారి ఆ ప్యాయంగా తనలో కలవడానికి ఆహ్వానిస్తుంది.

గోదావరి పేద గుండె లోతులు కలిగి.../
గోదావరి జాలిగుండె ప్రేగులు తడిసి.../
గోదావరి ఎడ ద కోసలను కోతపడి../
గోదావరి దేవి కోసమనసులో వొరసి/
కిన్నెరసానిని పిలిస్తే ఆమె వచ్చి కలుస్తుంది.
ఆదుకొను, పాదుకొను, తలిరుమల్లికలు, పొలుచుటలు/
కోరగించుటలో ఇటువంటి తెలుగు మాటల ప్రయోగాల్లో కిన్నెరసాని గోదావరిలో కలిసిపోతుంది.
 గోదావరి దేవి గొప్ప వంశపు రాణి అని, ఆమె ఏమ న్నా కాదనేందుకు వీల్లేదని, అసలు ఆమె కాదంటే ఏ పనీ చేయరాదని భావించింది కిన్నెరసాని నీటిదొరసానిగా. గోదావరి కిన్నెర కలసిపోయాక సమ్మేళనమైన జలం.
 
గోదావరి నీరు కూడి కిన్నెర నీరు/ఏది ఏదో తెలియనంతగా మారిపోయిందట. గోదావరి దేవిని కిన్నెరసాని కూడిన తర్వాత కిన్నెరసానికి దిగులే లేదట. ఏదైనా దిగులున్న ఎడదలున్న వారెవరైనా కిన్నెరసాని పాటలు చదువుతుంటే, పాడుకుంటే ఆనందం అర్ణవమవుతుంది వేవేల వర్ణాల వర్ణనా శోభతో.

No comments:

Post a Comment