Sunday, 27 August 2017

గణేష్...

ఆత్మీయులైన  మిత్రులందరికీ
వినాయక చవితి శుభాకాంక్షలు _/\_

పల్లవి  :జై జై జై  గణేశా జై బోలో గణేశా
           వరములిచ్చి మముగాచే  దేవుడివే గణేశా  || 2 ||

చరణం:తల్లిచ్చిన శక్తితోటి తండ్రిని ఎదిరించావూ
           ముక్కంటితొ పోరాడి వీరుడివనిపించావు  || 2 ||

            గజాసురుని మరణంతో ... గజాసురుని మరణంతో ...మరుజన్మను ఎత్తావు

   పల్లవి: జై జై జై  గణేశా జై బోలో గణేశా
           వరములిచ్చి మముగాచే  దేవుడివే గణేశా   || 2||

  చరణం : జ్ఞానానికి యోగానికి  ప్రతిరూపువి నీవెలే
              సిద్ధినిబుద్ధిని పొందిన తపోనిధివి నీవెలే || 2 ||
         
          పంచాక్షరి మంత్రమునే.... పంచాక్షరి మంత్రమునే ..... జపించేది నీవెలే

పల్లవి: జై జై జై  గణేశా జై బోలో గణేశా
          వరములిచ్చి మముగాచే  దేవుడివే గణేశా   || 2||

            తల్లితండ్రి చుట్టుతిరిగి తమ్ముని ఓడించావు
            గణనాథుని పదవిపొంది విఘ్నాలను ఆపావు 
            
            తొలిపూజను అందుకొనే ...  తొలిపూజను అందుకొనే ...దేవుడివే గణేశా

    
చరణం : వ్యాసుడు చెప్పిన శ్లోకములలవోకగ రాసావు
            భవ్యమైన  భారతాన్ని  మాకే అందించావు ||2||

            దంతమునే లేఖినిగా .... దంతమునే లేఖినిగా చేసుకున్న గణేశా 
           
పల్లవి:  జై జై జై  గణేశా జై బోలో గణేశా
           వరములిచ్చి మముగాచే  దేవుడివే గణేశా

            జై జై జై  గణేశా శరణు శరణు గణేశా
            జై జై జై  గణేశా జై బోలో గణేశా 
            జై జై జై  గణేశా జై బోలో గణేశా
            జై జై జై  గణేశా జై బోలో గణేశా.   _/\_  #శ్రీ

Wednesday, 16 August 2017

సీసపద్యము..

సీస పద్యము....

గడించె కాలము గణనసేయగ
        మీనమేషములును మేలు చూడ
వారము చూడంగ వర్జ్యము లెన్నంగ
        కాగల కార్యము కాన  లేము.
శకునము శాసించ  శ్వాసయు ఆగిపోవు
          వైద్యము చేయించ వయసు పెరుగు
కులము ఎక్కువనుచు గొప్పలు పోయెదే
          మనిషిలో ప్రవహించు మాన వతయె....

ఆ .మంత్రములకు రాలునేచింత కాయలు.
      జపము చేయగ జడత మాన గలడ.
      నీతిమంతుడుగను నియతితోడ
      నిలువ జయము నీదె నిశ్చయముగ....

డాక్టర్.శ్యామల గడ్డం...16-08-2017...
గడించె కాలము గణనసేయంగను
        మీనమేషములును మేలు చూడ
వారము చూడంగ వర్జ్యము లెన్నంగ
        కాగల కార్యము కాన  లేము.
శకునము శాసించ  శ్వాసయు  నిలుచుగా.
          వైద్యము చేయించ వయసు పెరుగు
కులము ఎక్కువనుచు గొప్పలు పోయెదే
          మనిషిలో ప్రవహించు మాన వతయె....

మంత్రములకు రాలునేచింత కాయలు.
జపము చేయగ జడత మాన గలడ.
నీతిమంతుడుగను నియతితోడ
నిలువ జయము నీదె నిశ్చయముగ....

డాక్టర్.శ్యామల గడ్డం...16-08-2017...

గోపిగారిగురించి

మిథున కవితా వనం సభ్యులకు నమస్సుమాంజలులు...ఇంకొన్ని గంటల్లో గురువారం వచ్చేస్తుంది.. గురువారం కవనతరంగిణికి స్వాగతం సుస్వాగతం........

ఆధునిక కవితా ప్రక్రియలకు పెద్దపీట వేసే కవనతరంగిణి మీ ముందుకు వచ్చింది......దీనిలో...

రుబాయీలు,
గజళ్ళు,.
నానీలు..
నానోలు.
హైకూలు.
రెక్కలు
ఏకపాదకవితలు,
ద్విపాదకవితలు,...
త్రి పాద కవితలు...
వచన కవితలు..
చిత్ర కవితలు
పద్యాలు...

మరి యే ఇతర ప్రక్రియ అయినా.....కవనతరంగిణికి రాసి పోస్టు చేయవలసిందిగా కోరుతున్నాను...

.

:

ఎన్‌.గోపి నల్లగొండ జిల్లా భువనగిరిలో జన్మించారు. తెలుగు విశ్వవిద్యాలయానికి ఉపాధ్యక్షులుగా పనిచేశారు. గోపి రాసిన అపూర్వమైన దీర్ఘకావ్యం – జలగీతం. ఈ కావ్యాన్ని జలబ్రహ్మ, రామన్‌మెగసెసె అవార్డు గ్రహీత రాజేంద్రసింగ్‌కు అంకితిమిచ్చారు. జలగీతం వైజ్నానిక భూమిపై మొలచిన తాత్విక మానవీయ కవిత. ఈ కావ్యం భారతీయ భాషల్లోకి అనువాదం అయ్యింది. నానీల కవితా రూప సృష్టికర్త అయిన గోపీని నానీల నాన్న అంటారు. నానీలంటే నావీ, నీవి వెరసి మనవి అని అర్థం. చిన్న పిల్లల్లాగ చిట్టి కవితలని అర్థం.

నానీల లక్షణాలు : నాలుగు పదాలతో ఒక్కొక్క పాధంలో 20-25 అక్షరాలతో రాస్తారు. చివరి రెండు లేదా ఒక పాదంలో ఒక చరుపు, విసురు (పంచ్‌) ఉండాలి. ఇప్పటి వరకు 200లకు పైగా నానీల కవితా సంపుటాలొచ్చాయి. గోపి 730 నానీలు రాశారు. గోవాలో సముద్రం, మరో ఆకాశం (ఇంగ్లండ్‌ కవితలు) వంటి యాత్రా కవితలు రాశారు.

గోపి కవిత్వంలోని కొన్ని పంక్తులు :

తంగెడు పూలు అంటే ఒప్పుకోను /బంగరు పూలు/పొంగిన విచారాన్ని దిగమింగిన పూలు.

నా పద్యాలే నన్ను మనిషిగా/మనిషిగా మనిషిగా మారుస్తాయి /వస్తువు దొరకనపుడు కవిత్వం పస్తులుంటుంది.

ఇప్పుడు నగరం నగరంలో వుండక /పల్లెల్లోకి కూడా ప్రవహిస్తుంది.

అమ్మ రుణం తీరదు / అమ్మకు అమ్మనై పుడితే తప్ప.

లక్షల్తో త్యాగాన్ని వెలిగించి/ఇంట్లో ఎండిన డొక్కల కోసం /ఇల్లిల్లూ తిరుగుతుంటాడు (ఫ్రీడం ఫైటర్‌ ).

నానీలు :

కుండముక్కలైందా/కుమిలిపోకు/మట్టి మరో రూపం కోసం సిద్ధమవుతుంది.

రొయ్య మడుగుల కింద/భూమాత కళేబరం వలవేస్తే/ డాలర్లే పడ్డాయి.

భాషంటే /డ్రాయింగ్‌ రూం చిలక/మరియాస/ వంటింటి పరిమళం

తన ఊళ్లో తానే  పరాయిదైంది/ తెలంగాణపల్లె గాయపడిన చెల్లె.

సచివాలయం వెయ్యికాళ్ల/ జెర్రి కాళ్లన్నీ కదుల్తాయి/ నడక సాగదు.

జలగీతం నుంచి :

జలం ఒక సంస్కృతి/ జలం ఒక చారిత్రక కృతి/ జలం సకల విన్యాసాల ఆవిష్కృతి.

భూమికి పురుడు పోసింది/నీరే కదా జలజలలాడే గుండెను/ గట్టి పరుచుకొని.

నీటిని కోరటమంటే/ జీవనసారాన్ని కాంక్షించటం/ మనిషీ! నీటిని తెలుసుకోవటమంటే/

నిన్ను నువ్వు తెలుసుకోవటమే.

చెరువులు బాల్యస్మృతిగా మారటం /ఎంత విషాదం/ చెరువులు కళేబరాలై పడి ఉండటం

/ఎంత విడ్డూరం!/చెరువుల్ని ఎవరెత్తుకు పోయారు.

 
.

 

గోపి..

చూసుకుంటున్నారు. దీనికంతటికి కారణం కే వలం గోపి అనడం అతిశయోక్తి కాదేమో. .

:

ఎన్‌.గోపి నల్లగొండ జిల్లా భువనగిరిలో జన్మించారు. తెలుగు విశ్వవిద్యాలయానికి ఉపాధ్యక్షులుగా పనిచేశారు. గోపి రాసిన అపూర్వమైన దీర్ఘకావ్యం – జలగీతం. ఈ కావ్యాన్ని జలబ్రహ్మ, రామన్‌మెగసెసె అవార్డు గ్రహీత రాజేంద్రసింగ్‌కు అంకితిమిచ్చారు. జలగీతం వైజ్నానిక భూమిపై మొలచిన తాత్విక మానవీయ కవిత. ఈ కావ్యం భారతీయ భాషల్లోకి అనువాదం అయ్యింది. నానీల కవితా రూప సృష్టికర్త అయిన గోపీని నానీల నాన్న అంటారు. నానీలంటే నావీ, నీవి వెరసి మనవి అని అర్థం. చిన్న పిల్లల్లాగ చిట్టి కవితలని అర్థం.

నానీల లక్షణాలు : నాలుగు పదాలతో ఒక్కొక్క పాధంలో 20-25 అక్షరాలతో రాస్తారు. చివరి రెండు లేదా ఒక పాదంలో ఒక చరుపు, విసురు (పంచ్‌) ఉండాలి. ఇప్పటి వరకు 200లకు పైగా నానీల కవితా సంపుటాలొచ్చాయి. గోపి 730 నానీలు రాశారు. గోవాలో సముద్రం, మరో ఆకాశం (ఇంగ్లండ్‌ కవితలు) వంటి యాత్రా కవితలు రాశారు.

గోపి కవిత్వంలోని కొన్ని పంక్తులు :

తంగెడు పూలు అంటే ఒప్పుకోను /బంగరు పూలు/పొంగిన విచారాన్ని దిగమింగిన పూలు.

నా పద్యాలే నన్ను మనిషిగా/మనిషిగా మనిషిగా మారుస్తాయి /వస్తువు దొరకనపుడు కవిత్వం పస్తులుంటుంది.

ఇప్పుడు నగరం నగరంలో వుండక /పల్లెల్లోకి కూడా ప్రవహిస్తుంది.

అమ్మ రుణం తీరదు / అమ్మకు అమ్మనై పుడితే తప్ప.

లక్షల్తో త్యాగాన్ని వెలిగించి/ఇంట్లో ఎండిన డొక్కల కోసం /ఇల్లిల్లూ తిరుగుతుంటాడు (ఫ్రీడం ఫైటర్‌ ).

నానీలు :

కుండముక్కలైందా/కుమిలిపోకు/మట్టి మరో రూపం కోసం సిద్ధమవుతుంది.

రొయ్య మడుగుల కింద/భూమాత కళేబరం వలవేస్తే/ డాలర్లే పడ్డాయి.

భాషంటే /డ్రాయింగ్‌ రూం చిలక/మరియాస/ వంటింటి పరిమళం

తన ఊళ్లో తానే  పరాయిదైంది/ తెలంగాణపల్లె గాయపడిన చెల్లె.

సచివాలయం వెయ్యికాళ్ల/ జెర్రి కాళ్లన్నీ కదుల్తాయి/ నడక సాగదు.

జలగీతం నుంచి :

జలం ఒక సంస్కృతి/ జలం ఒక చారిత్రక కృతి/ జలం సకల విన్యాసాల ఆవిష్కృతి.

భూమికి పురుడు పోసింది/నీరే కదా జలజలలాడే గుండెను/ గట్టి పరుచుకొని.

నీటిని కోరటమంటే/ జీవనసారాన్ని కాంక్షించటం/ మనిషీ! నీటిని తెలుసుకోవటమంటే/

నిన్ను నువ్వు తెలుసుకోవటమే.

చెరువులు బాల్యస్మృతిగా మారటం /ఎంత విషాదం/ చెరువులు కళేబరాలై పడి ఉండటం

/ఎంత విడ్డూరం!/చెరువుల్ని ఎవరెత్తుకు పోయారు.

 

సచివాలయం వెయ్యికాళ్ల/ జెర్రి కాళ్లన్నీ కదుల్తాయి/ నడక సాగదు.

జలగీతం నుంచి :

జలం ఒక సంస్కృతి/ జలం ఒక చారిత్రక కృతి/ జలం సకల విన్యాసాల ఆవిష్కృతి.

భూమికి పురుడు పోసింది/నీరే కదా జలజలలాడే గుండెను/ గట్టి పరుచుకొని.

నీటిని కోరటమంటే/ జీవనసారాన్ని కాంక్షించటం/ మనిషీ! నీటిని తెలుసుకోవటమంటే/

నిన్ను నువ్వు తెలుసుకోవటమే.

చెరువులు బాల్యస్మృతిగా మారటం /ఎంత విషాదం/ చెరువులు కళేబరాలై పడి ఉండటం

/ఎంత విడ్డూరం!/చెరువుల్ని ఎవరెత్తుకు పోయారు.

 

Friday, 11 August 2017

గజల్

గజల్ పూరణం...11.08.2016
+++++++++++++++++++++

అమ్మచెంత మనసుంటే ఆమెకరుణ సులువుకదా

అలుకచెందు పసిపాపల కోర్కెతీర సులువుకదా

బాధనొందు హృదయానికి గాయమవుట తేలికలే

గతమంతా మరచిపోవు మందుండిన  సులువుకదా

జ్ఞానజ్యోతి మెరుపుల లో కలలుకనుట సౌఖ్యములే

భాగ్యరాశి తానంతట కదలినంత సులువుకదా

మానవుడే మాధవుడని తెలుసుకొనుట వివేచనము

కనులముందు దైవాన్నే దర్శించుట సులువుకదా

ఆకులందు అణగియున్న పికముగళము మధురమవులె

మధురరాగమాలపించ దర్శించుట సులువుకదా..

డా. శ్యామలగడ్డం...11.08.2016

Wednesday, 9 August 2017

సామల సదాశివ.....

తురుము​ కవితా వనం సభ్యులకు నమస్సుమాంజలులు...ఇంకొన్ని గంటల్లో గురువారం వచ్చేస్తుంది.. గురువారం కవనతరంగిణికి స్వాగతం సుస్వాగతం........

ఆధునిక కవితా ప్రక్రియలకు పెద్దపీట వేసే కవనతరంగిణి మీ ముందుకు వచ్చింది......దీనిలో...

రుబాయీలు,
గజళ్ళు,.
నానీలు..
నానోలు.
హైకూలు.
రెక్కలు
ఏకపాదకవితలు,
ద్విపాదకవితలు,...
త్రి పాద కవితలు...
వచన కవితలు..
చిత్ర కవితలు
పద్యాలు...

మరి యే ఇతర ప్రక్రియ అయినా.....కవనతరంగిణికి రాసి పోస్టు చేయవలసిందిగా కోరుతున్నాను...

సదాశివ గారి గురించి "నా నేర్చిన భంగి చెప్పి "  సంతృప్తి పొందుతానని విన్నవించుకుంటున్నాను.... సదాశివ గారి గురించి చెప్పమంటే సముద్రాన్ని ఈదడమే ! కొండను అద్దంలో చూపించడమే..! . ఆగస్ట్ 07 - 2012 లో  దివంగతులైనారు వారు. వారి వర్ధంతి సందర్భంగా వారిగురించి తెలుసుకోవడం అవసరమనిపించింది...

   సదాశివ మాస్టారు మే నెల 11 వ తేదీ 1928లో ఆదిలాబాద్ జిల్లా లో జన్మించారు..యుక్తవయసునుండే కవిత్వం రచన అలవడింది..సాహిత్య నేపథ్యం కానీ, సంగీత నేపథ్యం కానీ లేని ఇంట్లో జన్మించి బహుభాషా కోవిదులై, ఉర్దూ భాషా సాహిత్యాలను పుక్కిట పట్టిన వారై
గజల్ కవులను రుబాయీల రచయితలను చదివి వారి సాహిత్యాల మర్మాలను గ్రహించిన వారై, వాటిని తెలుగు సాహిత్యాభిలాషులకు అందచేసిన  ఘన కీర్తి మంతుడు.
తెలంగాణా విఙ్ఞాన గని..  ఆదిలాబాద్ నివాసంగా మాస్టారు
ఉపాధ్యాయవృత్తి చేపట్టి ఎప్పటికప్పుడు తన ఙ్ఞానబలాన్ని పెంచుకుంటూ విద్యార్థులకు వెలుగులు పెంచిన నిత్య చైతన్యశీలి...

సమాజంలో ఎవరు చదివినా చదవకపోయినా నష్టం లేదు.కానీ ఉపాధ్యాయుడు నిత్య అధ్యయనశీలి కానట్లయితే ఒక తరం నష్టపోతుంది అన్నది వారి నిర్ద్వంద్వమైన అభిప్రాయం..

  సున్నితత్వం, మనిషి తత్వం, బాగా ఎరిగిన అక్షరసేనాని .
తెలంగాణ భాషకు నుడికారం సదాశివ గారు.
1949,50లనుండి తన సాహిత్య ప్రస్థానాన్ని సాగించారు..
దాదాపు 60 సంవత్సరాలు నిర్విరామంగా, నిరాటంకంగా
సాహితీ పయనం సాగించారు..

  వారికి సాహిత్యంలో ప్రవేశం లేని అంశం లేదు. తెలుగులో ఎంత సులువుగా రాయగలరో, అంతే సులభంగా సంస్క్శతంలోనూ, ఉర్దూలోనూ, ఆంగ్లంలోనూ, హిందీలోనూ రాయగలరు మాట్లాడగలరు. తన జీవితసహచరివలన మరాఠీలోనూ ప్రవేశం కలిగింది..ఉర్దూ వారి,నా పొర్సీ భాషలోనూ ప్రావీణ్యం లభించింది..

  ఎన్ని భాషలు నేర్చి నా మాతృభాషపై , భాషయాసపై ఎంతో మమకారం కలిగి ఉన్నారు. ఆదిలాబాద్ గిరిజన వీరుడు కొమురం భీంను 1972లో 7వ తరగతి పాఠ్యాంశంగా రాసి దానిని పాఠ్య పుస్తకంలో చేర్చిన కార్యశీలి..

  వారి రచనలు ప్రధానమైనవి..

1.నిరీక్షణం, 2ప్రభాతం, 3. సాఖీనామా..4. విశ్వామిత్రుడు., 5. సదాశివ కావ్య సుధలో..
ఉర్దూ సాహిత్య చరిత్ర,. పార్టీ కవులు ప్రసక్తి. , మీర్జా గాలిబ్,
అంజాద్ రుబాయీలు, హిందుస్తానీ మ్యూజికల్( మలయమారుతాలు) , సంగీత శిఖరాలు, యాది(2005లో) మొ...వి ఉన్నాయి.

తెలంగాణా వాళ్ళకు సంగీతంతో సంగీతం సమానమైన ఉర్దూతో ఎంత ఆత్మీయ బంధముందో " యాది" లోని చెప్తారు. తెలంగాణా సామాన్య ప్రజలు మాట, మాటకూ సామెత ఉపయోగించినట్లు అప్పటి విద్యావం తులు షేర్లను ఉపయోగిస్తారని చెప్పారు..ఉదా..కాళోజీ రామేశ్వర శర్మ గారి షేర్లు నుంచి వివరిస్తారు..

రెమ్మకు అతుక్కొని ఎంతసేపు వేలాడతావు...

ఆకురాలు కాలం వచ్చింది రాలిపోరాదా.....

అంటూ చెప్తారు..

వారు సంపూర్ణ వ్యక్తి..ప్రతిక్షణం జీవించారు...

సంభాషణా చాతుర్యం కలవారు...వారు మాట్లాడుతుంటే వెన్నెల గోదారై పారుతుందట....

సప్తలయల మర్మాన్ని , హిందుస్తానీ మాధుర్యాన్నీ పామరులకు అందించిన అక్షర యోధుడు.

అక్షర కృషీవలుడై తెలంగాణా సాహిత్య మాగాణాన్ని సస్య శ్యామలం  చేసిన  కళాకారుడికి (కలాయుధుడికి) సాహిత్యాభిమానులు ఏమిచ్చి రుణం తీర్చుకోగలరు?....

మీరు కూడా కలాయుధులై కవితల,గుంజిళ్ళు పంట పండిస్తే తప్ప!   ఇంకా సిధ్ధం కండి....

శ్రీమతి లీలా గారు ఇచ్చిన అవకాశంతో ఈ విధమైన సాహిత్య సేవ చేస్తున్నందుకు సంతసిస్తూ.....సభ్యులందరికి
అభినందనలతో

మీ

అడ్మిన్,

డాక్టర్.శ్యామల గడ్డం...

10-08-2017...
.

Monday, 7 August 2017

పద్యం..

.
పద్యతరంగిణి..మొదటిసారి సీసపద్యం ,రాయటం..

సీ.    నగరబడులయందు, నాస్తి తెలుగు పల్కు.
          పల్లె బడులయందు పాతబడియె

      మమ్మి డాడి యనగ మాటలాడగ  ముర్సి
              ఇంగిలీసునునేర్చు ఎటులనైన

పరభాష యనసంత పరవశమేలనో
   అమ్మ భాషను మించు అందమేది

మందార మకరంద మాధుర్యమనుమాట
      తేట తెలుగు మాట తీయనెంతొ

ఆ.వె. తల్లి తండ్రి తోడ చెల్లి బావల తోడ
          బడులయందు, మరియు గుడులయందు
          మాటలాడ వలయుమరువక మనభాష
          మాతృఋణము వలెను తీరు ఋణము..

డాక్టర్ శ్యామల గడ్డం.......06-06-2017..

ద్విపదలు

ద్విపద మాలికలు....28-06-2017..
-----_-----++--------------------------+++

ప్రతి ఇంటిలో ప్రేమ ప్రతిఫలించాలి
తొలిపల్కు ఇంటింట తెలుగు కావాలి

ప్రతి ఇంటిలో ప్రేమ ప్రతిఫలించాలి.
అనురాగ గీతాలు ఆలపించాలి..

ప్రతి ఇంటిలో ప్రేమ ప్రతి ఫలించాలి.
స్వరరాగ మధురిమ శ్వాస కావాలి

మమతానుబంధాలు. మంచి కూర్చాలి
మాటల్లొ  నిపుణత మంచి చేయాలి..

డాక్టర్.శ్యామలగడ్డం....

Saturday, 5 August 2017

బాల్యం...కవిత

బాల్యం బాధ్యతల్లేని ఉల్లాసవంతమైన జీవితం
బాల్యం బరువుల్లేని స్వేఛ్ఛా జీవనం
వేపచెట్టు నీడలో ఆనాడు నేస్తాలతో ఆడిన బొమ్మలాటలు
వేడుకగా చేసినబొమ్మల పెళ్ళిళ్ళు, పంచిన పప్పుబెల్లాలు
ఆ బాల్యం మళ్ళీ వస్తే ఎంత బావుండు!
ఇంటి సావడే వేదికగా చేసి వేసిన నాటకాలు
పాడిన పాటలు, ఆడిన ఆటలు
అన్నీ గుర్తుకొస్తున్నాయి
ఎప్పుడో తిన్న మధుర పదార్ధాన్ని తలచుకోగానే నోట్లో నీళ్ళూరినట్లు!
చిన్న చిన్న పలుగురాళ్ళతో ఈతపండ్లను రాలగొట్టి ఏరుకుతిన్నామని,
గోడే అడ్డంగా ఉన్న స్నేహితురాలించికి గోడదూకి వెళ్ళామని
అమ్మా వాళ్ళు అరుస్తుంటే, అవన్నీ ఆశీర్వాదాలుగా గ్రహించి
సంతోషంగా గడిపిన ఆ రోజులు మరలిరావు మరపురావు
ఇంటిముందుకు దేవుడొస్తున్నాడని, పొద్దున్నే శుచితో
దేవుడికినీరాజనాలర్పించిన రోజులు,
బతుకమ్మ ఆడే రోజుల్లో, స్నేహితులకోసం ఎదురుచూపులు
తీరొక్కపూవేసి, బతుకమ్మ పేర్చిన సరదాలు
కమ్మనైన బతుకమ్మ పాటలు పాడి గంతులేసిన రోజులు
అవన్నీ మరపురాని మధుర స్మృతులు
జాతిమత భేదాలుకానీ కులకుమ్ములాటలు కానీ లేక
మనసే స్వఛ్ఛమైన మల్లెపూవై
స్నేహ పరిమళాలను వెదజల్లే ఆ బాల్యం తిరిగిరాదు

కోపాలు తాపాలు, వెక్కిరింతలు, కొక్కిరింతలు, క్షణకాలం
అనురాగం, ఆప్యాయత , ప్రేమ , అక్షయమైన ఆ రోజులు మరలిరావు

మావూళ్ళో ఉరుసు జరిగినప్పుడు లతీసాబ్ గుట్టమీద
బెల్లం చదివించడం, పీర్లపండగప్పుడు మేం కూడా ఆ పీర్ల వెంబడి పరుగెత్తడం
ఇవన్నీ మచ్చలేని, మతభేదములు లేని, మానవతకు చిహ్నాలు

డా----జి,శ్యామల---

Wednesday, 2 August 2017

ఆచార్య ఆత్రేయ....


ఆచార్య ఆత్రేయగా సినీరంగ ప్రవేశం చేసిన కిళాంబి వెంకట నరసింహాచార్యులు (మే 71921 - సెప్టెంబర్ 131989) తెలుగులో సుప్రసిద్ధ నాటక, సినిమా పాటల, మాటల రచయిత, నిర్మాత మరియు దర్శకులు. దాదాపు 400 సినిమాలకు మాటలు, పాటలు రాసిన గొప్పకవి.[1] అత్రేయకి ప్రముఖ నటుడు కొంగర జగ్గయ్య ఆప్తమిత్రుడు.ఆత్రేయ వ్రాసిన పాటలు,నాటకాలు,నాటికలు,కథలు మొదలగు రచనలన్నీ ఏడు సంపుటాలలో సమగ్రంగా ప్రచురించి జగ్గయ్య తన మిత్రుడికి గొప్ప నివాళి అర్పించాడు అని చెప్పవచ్చు. ఆచార్య ఆత్రేయ తెలుగు సినిమా గేయరచయితగా, సంభాషణకర్తగా పేరుపొందినా నిజానికి ఆయన మాతృరంగం నాటకాలే. నాటక రచయితగా ఆయన స్థానం సుస్థిరం. మనసుకవిగా సినిమా వారు పిలుచుకునే ఆత్రేయ నాటకాల్లో చక్కని ప్రయోగాలు చేసి నాటక రంగాన్ని మలుపుతిప్పారు.

ఆత్రేయజననంకిళాంబి వెంకట నరసింహాచార్యులు..




921 మే 7 న శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోనిసూళ్ళూరుపేట మండలంలో గల మంగళంపాడు గ్రామంలో జన్మించాడు. తండ్రి కృష్ణమాచార్యులు. తల్లి సీతమ్మ. చిన్నప్పటినుండి నాటకంలోని పద్యాలను రాగయుక్తంగా చదివేవారు. సమాజంలో మధ్య తరగతి కుటుంబ సమస్యలను తీసుకుని మనోహరమైన నాటకాలుగా మలిచారు. వీరి 'ప్రవర్తన', 'ఎన్.జి.వో' నాటకాలు ఆంధ్ర నాటక కళా పరిషత్ అవార్డులను గెలుచుకున్నారు. విశేషంగా రాష్ట్రవ్యాప్తంగా వందల సంఖ్యలో ప్రదర్శనలు జరిగాయి. అలాగే 'కప్పలు' బాగా ప్రాచుర్యం పొందిన నాటకం. రాయలసీమ క్షామ పరిస్థితులను వివరించే 'మాయ' నాటకం, స్వాతంత్ర్యానంతరం దేశంలో చెలరేగిన హిందూ ముస్లిం హింసాకండను 'ఈనాడు' అనే మూడంకాల నాటకం మరియు విశ్వశాంతిని కాంక్షించే 'విశ్వశాంతి' నాటకాన్ని రచించారు. విశ్వశాంతి నాటకానికి కూడా రాష్ట్ర స్థాయి బహుమతి లభించింది. 'సామ్రాట్ అశోక','గౌతమ బుద్ధ' మరియు 'భయం' నాటకాలు కూడా వ్రాసారు. ఆత్రేయ పలు చలన చిత్రాలకు సంభాషణలు, పాటలు రాశారు. వీరి పాటలలో ఎక్కువగా మనసుకు సంబంధించిన ప్రస్తావన ఉండటం వలన ఆయన మనసు కవిమన సుకవి అయ్యాడు. దీక్ష (1950) చిత్రానికి తొలిసారి గీత రచన, అదే సంవత్సరంలో విడుదలైన సంసారం చిత్రానికి తొలిసారి కథా రచన చేసారు. వాగ్ధానం (1961) చిత్రాన్ని నిర్మించి, దర్శకత్వం కూడా చేసాడు.

చిన్ని చిన్ని పదాలతో స్పష్టమైన భావాన్ని పలికించడంలో ఆత్రేయ ఘనాపాటి. తెలుగు పాటను ఆస్వాదించే అందరి మనసులను దోచుకున్న ఈ మనసు కవి 1989,సెప్టెంబర్ 13 న స్వర్గస్తులయ్యారు.

మనసు కవి ఆత్రేయ సినీ గీత ప్రస్థానం...

'దీక్ష' (1950) చిత్రానికి తొలిసారి ఆయన పాటలు రాశారు. "పోరా బాబు పో.." అంటూ సాగే పాట ప్రేక్షకులను, సినీ మేకర్స్‌ని బాగా ఆకట్టుకోవడం ఆత్రేయ పాటల్లోని మాధుర్యం ఏంటో సినిమా పరిశ్రమకు తెలిసింది. అదే ఏడాదిలో విడుదలైన 'సంసారం' చిత్రానికి తొలిసారి కథా రచన కూడా చేశారు. దీంతో దర్శక, నిర్మాతలంతా ఆత్రేయతో పాటలు రాయించేందుకు క్యూ కట్టారు. 'అర్థాంగి' చిత్రంలో 'రాక రాక వచ్చావు చందమామా..', 'తోడి కోడళ్ళు' చిత్రంలో 'కారులో షికారుకెళ్లి...', 'శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం'లో 'శీశైలవాసా శ్రీ వెంకటేషా...', 'మంచి మనసులు'ల్లో 'శిలలపై శిల్పాలు చెక్కినారు...', 'మూగ మనసులు' చిత్రంలో 'ముద్దబంతి పువ్వులో...' 'డాక్టర్‌ చక్రవర్తి'లో 'నీవులేక వీణ ...', 'అంతస్తులు'లో 'తెల్ల చీర కట్టుకున్నది ఎవరి కోసము...', 'ప్రేమ్‌నగర్‌'లో 'నేను పుట్టాను ఈ లోకం మెచ్చింది. నేను ఏడ్చాను ఈ లోకం నవ్వింది. నేను నవ్వాను ఈ లోకం ఏడ్చింది...', 'మరోచరిత్ర'లో 'ఏ తీగ పువ్వునో ఏ కొమ్మ తేటినో...', 'ఇంద్రధనస్సు'లో 'నేనొక ప్రేమ పిపాసిని నీవొక ఆశ్రమ వాసివి...', 'అంతులేని కథ'లో 'కళ్ళల్లో ఉన్నదేదో కన్నులకు తెలుసు...', 'మరోచరిత్ర'లో 'విధి చేయు వింతలన్నీ...', 'ఇది కథ కాదు'లో 'సరిగమలు గలగలలు...', 'స్వాతిముత్యం'లో 'చిన్నారి పొన్నారి కిట్టయ్య...' తోపాటు 'తేనే మనసులు', 'ప్రైవేట్‌ మాస్టర్‌', 'బ్రహ్మాచారి', 'మట్టిలో మాణిక్యం', 'బడి పంతులు', 'పాపం పసివాడు', 'భక్త తుకారం', 'బాబు', 'జ్యోతి', 'అందమైన అనుబంధం', 'గుప్పెడు మనసు', 'ఆకలి రాజ్యం', 'అభిలాష', 'కోకిలమ్మ', 'అభినందన', 'ప్రేమ' వంటి చిత్రాల్లో 1400లకుపైగా పాటలు రాసి తెలుగు ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకున్నారు. పాటలన్ని భావోద్వేగాల సమాహారంగా ఉండటంతో ఆత్రేయను 'మనసు కవి'గా ప్రేక్షకులు, అభిమానులు అభివర్ణించారు. ఎంతటి బరువైన భావాలనైనా అర్థవంతమైన తేలికైన పదాలతో పలికించడంతో ఆత్రేయ దిట్ట. మూడున్నర దశాబ్దాల సినీ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను చవిచూశారు. పాటల్లో తన అనుభవాలను పొదిగి, గుండె బరువును దించుకునేవారని ఆయన సన్నిహితులు పలు సందర్భాల్లో చెప్పారు..

ఈ రోజు కవనతరంగిణిలో మనసు పదం వచ్చే గేయాలను రాయండి..మరే ప్రక్రియలోనైనా మనసు మాట వచ్చేవారం రాయండి...


ఈ వివరణ కొన్నవెబ్సైట్లనుండి గ్రహించి బడింది...


Nil