తురుము కవితా వనం సభ్యులకు నమస్సుమాంజలులు...ఇంకొన్ని గంటల్లో గురువారం వచ్చేస్తుంది.. గురువారం కవనతరంగిణికి స్వాగతం సుస్వాగతం........
ఆధునిక కవితా ప్రక్రియలకు పెద్దపీట వేసే కవనతరంగిణి మీ ముందుకు వచ్చింది......దీనిలో...
రుబాయీలు,
గజళ్ళు,.
నానీలు..
నానోలు.
హైకూలు.
రెక్కలు
ఏకపాదకవితలు,
ద్విపాదకవితలు,...
త్రి పాద కవితలు...
వచన కవితలు..
చిత్ర కవితలు
పద్యాలు...
మరి యే ఇతర ప్రక్రియ అయినా.....కవనతరంగిణికి రాసి పోస్టు చేయవలసిందిగా కోరుతున్నాను...
సదాశివ గారి గురించి "నా నేర్చిన భంగి చెప్పి " సంతృప్తి పొందుతానని విన్నవించుకుంటున్నాను.... సదాశివ గారి గురించి చెప్పమంటే సముద్రాన్ని ఈదడమే ! కొండను అద్దంలో చూపించడమే..! . ఆగస్ట్ 07 - 2012 లో దివంగతులైనారు వారు. వారి వర్ధంతి సందర్భంగా వారిగురించి తెలుసుకోవడం అవసరమనిపించింది...
సదాశివ మాస్టారు మే నెల 11 వ తేదీ 1928లో ఆదిలాబాద్ జిల్లా లో జన్మించారు..యుక్తవయసునుండే కవిత్వం రచన అలవడింది..సాహిత్య నేపథ్యం కానీ, సంగీత నేపథ్యం కానీ లేని ఇంట్లో జన్మించి బహుభాషా కోవిదులై, ఉర్దూ భాషా సాహిత్యాలను పుక్కిట పట్టిన వారై
గజల్ కవులను రుబాయీల రచయితలను చదివి వారి సాహిత్యాల మర్మాలను గ్రహించిన వారై, వాటిని తెలుగు సాహిత్యాభిలాషులకు అందచేసిన ఘన కీర్తి మంతుడు.
తెలంగాణా విఙ్ఞాన గని.. ఆదిలాబాద్ నివాసంగా మాస్టారు
ఉపాధ్యాయవృత్తి చేపట్టి ఎప్పటికప్పుడు తన ఙ్ఞానబలాన్ని పెంచుకుంటూ విద్యార్థులకు వెలుగులు పెంచిన నిత్య చైతన్యశీలి...
సమాజంలో ఎవరు చదివినా చదవకపోయినా నష్టం లేదు.కానీ ఉపాధ్యాయుడు నిత్య అధ్యయనశీలి కానట్లయితే ఒక తరం నష్టపోతుంది అన్నది వారి నిర్ద్వంద్వమైన అభిప్రాయం..
సున్నితత్వం, మనిషి తత్వం, బాగా ఎరిగిన అక్షరసేనాని .
తెలంగాణ భాషకు నుడికారం సదాశివ గారు.
1949,50లనుండి తన సాహిత్య ప్రస్థానాన్ని సాగించారు..
దాదాపు 60 సంవత్సరాలు నిర్విరామంగా, నిరాటంకంగా
సాహితీ పయనం సాగించారు..
వారికి సాహిత్యంలో ప్రవేశం లేని అంశం లేదు. తెలుగులో ఎంత సులువుగా రాయగలరో, అంతే సులభంగా సంస్క్శతంలోనూ, ఉర్దూలోనూ, ఆంగ్లంలోనూ, హిందీలోనూ రాయగలరు మాట్లాడగలరు. తన జీవితసహచరివలన మరాఠీలోనూ ప్రవేశం కలిగింది..ఉర్దూ వారి,నా పొర్సీ భాషలోనూ ప్రావీణ్యం లభించింది..
ఎన్ని భాషలు నేర్చి నా మాతృభాషపై , భాషయాసపై ఎంతో మమకారం కలిగి ఉన్నారు. ఆదిలాబాద్ గిరిజన వీరుడు కొమురం భీంను 1972లో 7వ తరగతి పాఠ్యాంశంగా రాసి దానిని పాఠ్య పుస్తకంలో చేర్చిన కార్యశీలి..
వారి రచనలు ప్రధానమైనవి..
1.నిరీక్షణం, 2ప్రభాతం, 3. సాఖీనామా..4. విశ్వామిత్రుడు., 5. సదాశివ కావ్య సుధలో..
ఉర్దూ సాహిత్య చరిత్ర,. పార్టీ కవులు ప్రసక్తి. , మీర్జా గాలిబ్,
అంజాద్ రుబాయీలు, హిందుస్తానీ మ్యూజికల్( మలయమారుతాలు) , సంగీత శిఖరాలు, యాది(2005లో) మొ...వి ఉన్నాయి.
తెలంగాణా వాళ్ళకు సంగీతంతో సంగీతం సమానమైన ఉర్దూతో ఎంత ఆత్మీయ బంధముందో " యాది" లోని చెప్తారు. తెలంగాణా సామాన్య ప్రజలు మాట, మాటకూ సామెత ఉపయోగించినట్లు అప్పటి విద్యావం తులు షేర్లను ఉపయోగిస్తారని చెప్పారు..ఉదా..కాళోజీ రామేశ్వర శర్మ గారి షేర్లు నుంచి వివరిస్తారు..
రెమ్మకు అతుక్కొని ఎంతసేపు వేలాడతావు...
ఆకురాలు కాలం వచ్చింది రాలిపోరాదా.....
అంటూ చెప్తారు..
వారు సంపూర్ణ వ్యక్తి..ప్రతిక్షణం జీవించారు...
సంభాషణా చాతుర్యం కలవారు...వారు మాట్లాడుతుంటే వెన్నెల గోదారై పారుతుందట....
సప్తలయల మర్మాన్ని , హిందుస్తానీ మాధుర్యాన్నీ పామరులకు అందించిన అక్షర యోధుడు.
అక్షర కృషీవలుడై తెలంగాణా సాహిత్య మాగాణాన్ని సస్య శ్యామలం చేసిన కళాకారుడికి (కలాయుధుడికి) సాహిత్యాభిమానులు ఏమిచ్చి రుణం తీర్చుకోగలరు?....
మీరు కూడా కలాయుధులై కవితల,గుంజిళ్ళు పంట పండిస్తే తప్ప! ఇంకా సిధ్ధం కండి....
శ్రీమతి లీలా గారు ఇచ్చిన అవకాశంతో ఈ విధమైన సాహిత్య సేవ చేస్తున్నందుకు సంతసిస్తూ.....సభ్యులందరికి
అభినందనలతో
మీ
అడ్మిన్,
డాక్టర్.శ్యామల గడ్డం...
10-08-2017...
.