మిథున కవితా వనం సభ్యులకు నమస్సుమాంజలులు...ఇంకొన్ని గంటల్లో గురువారం వచ్చేస్తుంది.. గురువారం కవనతరంగిణికి స్వాగతం సుస్వాగతం........
ఆధునిక కవితా ప్రక్రియలకు పెద్దపీట వేసే కవనతరంగిణి మీ ముందుకు వచ్చింది......దీనిలో...
రుబాయీలు,
గజళ్ళు,.
నానీలు..
నానోలు.
హైకూలు.
రెక్కలు
ఏకపాదకవితలు,
ద్విపాదకవితలు,...
త్రి పాద కవితలు...
వచన కవితలు..
చిత్ర కవితలు
పద్యాలు...
మరి యే ఇతర ప్రక్రియ అయినా.....కవనతరంగిణికి రాసి పోస్టు చేయవలసిందిగా కోరుతున్నాను...
.
:
ఎన్.గోపి నల్లగొండ జిల్లా భువనగిరిలో జన్మించారు. తెలుగు విశ్వవిద్యాలయానికి ఉపాధ్యక్షులుగా పనిచేశారు. గోపి రాసిన అపూర్వమైన దీర్ఘకావ్యం – జలగీతం. ఈ కావ్యాన్ని జలబ్రహ్మ, రామన్మెగసెసె అవార్డు గ్రహీత రాజేంద్రసింగ్కు అంకితిమిచ్చారు. జలగీతం వైజ్నానిక భూమిపై మొలచిన తాత్విక మానవీయ కవిత. ఈ కావ్యం భారతీయ భాషల్లోకి అనువాదం అయ్యింది. నానీల కవితా రూప సృష్టికర్త అయిన గోపీని నానీల నాన్న అంటారు. నానీలంటే నావీ, నీవి వెరసి మనవి అని అర్థం. చిన్న పిల్లల్లాగ చిట్టి కవితలని అర్థం.
నానీల లక్షణాలు : నాలుగు పదాలతో ఒక్కొక్క పాధంలో 20-25 అక్షరాలతో రాస్తారు. చివరి రెండు లేదా ఒక పాదంలో ఒక చరుపు, విసురు (పంచ్) ఉండాలి. ఇప్పటి వరకు 200లకు పైగా నానీల కవితా సంపుటాలొచ్చాయి. గోపి 730 నానీలు రాశారు. గోవాలో సముద్రం, మరో ఆకాశం (ఇంగ్లండ్ కవితలు) వంటి యాత్రా కవితలు రాశారు.
గోపి కవిత్వంలోని కొన్ని పంక్తులు :
తంగెడు పూలు అంటే ఒప్పుకోను /బంగరు పూలు/పొంగిన విచారాన్ని దిగమింగిన పూలు.
నా పద్యాలే నన్ను మనిషిగా/మనిషిగా మనిషిగా మారుస్తాయి /వస్తువు దొరకనపుడు కవిత్వం పస్తులుంటుంది.
ఇప్పుడు నగరం నగరంలో వుండక /పల్లెల్లోకి కూడా ప్రవహిస్తుంది.
అమ్మ రుణం తీరదు / అమ్మకు అమ్మనై పుడితే తప్ప.
లక్షల్తో త్యాగాన్ని వెలిగించి/ఇంట్లో ఎండిన డొక్కల కోసం /ఇల్లిల్లూ తిరుగుతుంటాడు (ఫ్రీడం ఫైటర్ ).
నానీలు :
కుండముక్కలైందా/కుమిలిపోకు/మట్టి మరో రూపం కోసం సిద్ధమవుతుంది.
రొయ్య మడుగుల కింద/భూమాత కళేబరం వలవేస్తే/ డాలర్లే పడ్డాయి.
భాషంటే /డ్రాయింగ్ రూం చిలక/మరియాస/ వంటింటి పరిమళం
తన ఊళ్లో తానే పరాయిదైంది/ తెలంగాణపల్లె గాయపడిన చెల్లె.
సచివాలయం వెయ్యికాళ్ల/ జెర్రి కాళ్లన్నీ కదుల్తాయి/ నడక సాగదు.
జలగీతం నుంచి :
జలం ఒక సంస్కృతి/ జలం ఒక చారిత్రక కృతి/ జలం సకల విన్యాసాల ఆవిష్కృతి.
భూమికి పురుడు పోసింది/నీరే కదా జలజలలాడే గుండెను/ గట్టి పరుచుకొని.
నీటిని కోరటమంటే/ జీవనసారాన్ని కాంక్షించటం/ మనిషీ! నీటిని తెలుసుకోవటమంటే/
నిన్ను నువ్వు తెలుసుకోవటమే.
చెరువులు బాల్యస్మృతిగా మారటం /ఎంత విషాదం/ చెరువులు కళేబరాలై పడి ఉండటం
/ఎంత విడ్డూరం!/చెరువుల్ని ఎవరెత్తుకు పోయారు.
.
No comments:
Post a Comment