విష్ణు మూర్తి గారి పిక్ కి కవిత.....
తెల్ల కలువ రేకుల మీద భ్రమర వాలినట్లు......ఆ కన్నులు...
చందమామ నేలకుదిగి వచ్చినట్లు....ఆ మోము...
సంద్రంలోని ముత్యాలన్నీ నీ కర్ణాభరణములుగా మారినట్లు...
వల్లనైన మేఘాల దొంతరలు.
నీ కురులుగా మారాయేమో...
నెమలికన్నె మొయిలు కోసం ఎదురు చూస్తూ..కంఠాన్ని పక్కగా తిప్పినట్టు..
వెన్నెలంతా వంపేసుకుని కపోలాలుగా మార్చుకున్నట్లు...
దొండ పండి పెదాలుగా అయ్యాయేమో...
లతాంతాయుధుని శస్త్రములా అన్నట్లు ఆ కనుబొమలు.....
శివుని మూడో నేత్రమా అన్నట్లున్న
నుదుట మూడు గీతలు.....
మదనాగ్నిని చిమ్మే చూపులతో.......
ప్రకృతినే నీ వశం చేసుకున్న సుందరీ....
నీ అందానికి పురుషుడు దాసోహమనక ఏం చేస్తాడు పాపం..!!!
dr. syamalagaddam....
No comments:
Post a Comment