Friday, 28 July 2017

ప్రధాన మెనూను తెరువు

వెతుకు

సవరించుఈ పేజీ మీద కన్నేసి ఉంచుమరో భాషలో చదవండి

సింగిరెడ్డి నారాయణరెడ్డి

ప్రముఖ కవి, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత

సి.నా.రె. గా ప్రసిద్ధి చెందిన సింగిరెడ్డి నారాయణరెడ్డి (జూలై 291931 - జూన్ 122017) ప్రముఖ తెలుగు కవి, సాహితీవేత్త. తెలుగు సాహిత్యానికి ఆయన చేసిన ఎనలేని సేవలకు గాను ఆయనకు 1988లో విశ్వంభర కావ్యానికి ప్రతిష్ఠాత్మకమైన జ్ఞానపీఠ పురస్కారం లభించింది. సినారె రాజ్యసభ సభ్యునిగా కూడా నియమితుడయ్యాడు. తెలుగు చలన చిత్ర రంగములో ఆయన రాసిన పాటలు ఎంతో ప్రసిద్ధి చెందాయి

సి.నారాయణరెడ్డిజననంసింగిరెడ్డి నారాయణరెడ్డి
జూలై 291931
 హనుమాజీపేట్కరీంనగర్మరణంజూన్ 122017[1]
హైదరాబాద్తెలంగాణనివాస ప్రాంతంహైదరాబాద్తెలంగాణఇతర పేర్లుసినారెవృత్తికవి,
గేయరచయిత,
&
సాహితీవేత్తపురస్కారములు

సాహిత్య అకాడమీ అవార్డు (1973),
పద్మ శ్రీ (1977),
కళాప్రపూర్న (1978),
జ్ఞానపీఠ్ అవార్డు (1988),
పద్మ భూషణ్ (1992),

సాహిత్య అకాడెమీ ఫెలోషిప్ (2014)సంతకం

బాల్యం - విద్యాభ్యాసంసవరించు

సి.నారాయణరెడ్డి 1931జూలై 29 (అనగా ప్రజోత్పత్తి సంవత్సరం నిజ ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజు) న కరీంనగర్ జిల్లాలోని మారుమూల గ్రామము హనుమాజీపేట్లో జన్మించాడు. తండ్రి మల్లారెడ్డి రైతు. తల్లి బుచ్చమ్మ గృహిణి. నారాయణ రెడ్డి ప్రాథమిక విద్య గ్రామంలోని వీధిబడిలో సాగింది. బాల్యంలో హరికథలు, జానపదాలు, జంగం కథల వైపు ఆకర్షితుడయ్యాడు. ఉర్దూ మాధ్యమంలో సిరిసిల్లలో మాధ్యమిక విద్య, కరీంనగర్లో ఉన్నత పాఠశాల విద్య అభ్యసించాడు. అప్పట్లో తెలుగు ఒక ఐచ్ఛికాంశాంగానే ఉండేది. హైదరాబాదు లోని చాదర్‌ఘాట్ కళాశాలలో ఇంటర్మీడియట్, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బి.ఏ. కూడా ఉర్దూ మాధ్యమంలోనే చదివాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయము నుండి తెలుగు సాహిత్యములో పోస్టుగ్రాడ్యుయేట్ డిగ్రీ, డాక్టరేటు డిగ్రీ పొందాడు. విద్యార్థిగా శ్రీ కృష్ణదేవరాయ ఆంధ్రభాషా నిలయంలో అనేక గ్రంథాలు చదివాడు.

కుటుంబం

ఉద్యోగం - రచనా ప్రస్థానంసవరించు

ఆరంభంలో సికింద్రాబాదు లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో అధ్యాపకుడిగా చేరి అటు తర్వాత నిజాం కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేశాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయములో ఆచార్యునిగా పనిచేస్తూ అనేక ఉన్నత పదవులు, పురస్కారాలు పొందాడు. విశ్వనాధ సత్యనారాయణ తరువాత జ్ఞానపీఠ పురస్కారం పొందిన తెలుగు సాహీతీకారుడు ఆయనే. విశ్వంభర కావ్యానికి ఆయనకి ఈ అవార్డు లభించింది.

ఆయన ప్రముఖంగా కవి అయినప్పటికీ అయన కలం నుంచి పద్య కావ్యాలు, గేయ కావ్యాలు, వచన కవితలు, గద్య కృతులు, చలనచిత్ర గీతాలు, యాత్రా కథనాలు, సంగీత నృత్య రూపకాలు, ముక్తక కావ్యాలు, బుర్ర కథలుగజళ్ళువ్యాసాలు, విమర్శన గ్రంథాలు, అనువాదాలు మొదలైనవి వెలువడ్డాయి. కళాశాల విద్యార్థిగా శోభ పత్రికకు సంపాదకత్వం వహించారు. రోచిస్, సింహేంద్ర పేరుతో కవితలు రచించేవాడు. సినారె కవిత తొలిసారి జనశక్తి పత్రికలో అచ్చయింది. విద్యార్థి దశలోనే ప్రహ్లాద చరిత్రసీతాపహరణం వంటి పద్య నాటికలు, భలే శిష్యులు తదితర సాంఘిక నాటకాలు రచించాడు. 1953 లో నవ్వని పువ్వు సంగీత నృత్య నాటిక ప్రచురితమైంది. అది సి.నా.రె తొలి ప్రచురణ. వెంటనే జలపాతం, విశ్వగీతి, అజంతా సుందరి వెలువడ్డాయి.

రామప్ప సంగీత నృత్య రూపకం అన్ని భారతీయ భాషల్లోకి అనువాదమైంది. ఆయన పరిశోధన గ్రంథం ఆధునికాంధ్ర కవిత్వము - సంప్రదాయములు, ప్రయోగములు అత్యంత ప్రామాణిక గ్రంథంగా పేరు పొందింది. సినారె గ్రంథాలు ఇంగ్లీషుఫ్రెంచ్సంస్కృతంహిందీమలయాళంఉర్దూకన్నడం మొదలైన భాషల్లోకి అనువాదమయ్యాయి. ఆయనే స్వయంగా హిందీఉర్దూ భాషల్లో కవితలల్లారు. అమెరికాఇంగ్లండుఫ్రాన్స్రష్యాజపాన్కెనడాఇటలీడెన్మార్క్, థాయ్ ల్యాండ్, సింగపూర్మలేషియామారిషస్, యుగోస్లోవియా, ఆస్ట్రేలియా, గల్ఫ్ దేశాలను సందర్శించారు. 1990 లో యుగోస్లేవియా లోని స్రూగాలో జరిగిన అంతర్జాతీయ కవి సమ్మేళనంలో భారతీయ భాషల ప్రతినిథిగా పాల్గొన్నాడు.

రచనారంగమే కాక ఆయన తెలుగు సాహిత్య పత్రికగా స్రవంతి సాహిత్య మాసపత్రికను నిర్వహించారు. వేమూరి ఆంజనేయశర్మచిర్రావూరి సుబ్రహ్మణ్యంతో పాటుగా సినారె పత్రికకు ప్రధాన సంపాదకత్వం వహించారు.[2]

పురస్కారాలుసవరించు

1988వ సంవత్సరానికి ప్రతిష్ఠాత్మకమైన జ్ఞానపీఠ పురస్కారంఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ పురస్కారంకేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారంభారతీయా భాషా పరిషత్ పురస్కారంరాజలక్ష్మీ పురస్కారంసోవియట్-నెహ్రూ పురస్కారంఅసాన్ పురస్కారంపద్మశ్రీ పురస్కారంపద్మభూషణ్ పురస్కారంఉస్మానియా విశ్వవిద్యాలయము నుండి తెలుగు సాహిత్యము డాక్టరేటు డిగ్రీఉత్తమ పాటల రచయిత - ఇదిగో రాయలసీమ గడ్డ, సీతయ్య చిత్రానికి నంది పురస్కారండా. బోయి భీమన్న జీవన సాఫల్య పురస్కారం - 2 లక్షల నగదు, ప్రశంస పత్రం (బోయి భీమన్న సాహిత్య పీఠం,తెలుగు విశ్వవిద్యాలయం, 19.09.2014)[3].

ఆంధ్ర, కాకతీయ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్, మీరట్, నాగార్జున విశ్వ విద్యాలయాలు ఆయనకు గౌరవ డాక్టరేట్లను ప్రదానం చేశాయి. [4]

పదవులు

రచనలుసవరించు

కవిత్వం:

విశ్వంభరమనిషి - చిలకముఖాముఖిభూగోళమంత మనిషిదృక్పథంకలం సాక్షిగాకలిసి నడిచే కలంకర్పూర వసంతరాయలుమట్టి మనిషి ఆకాశంతేజస్సు నా తపస్సునాగార్జున సాగరంవిశ్వనాథ నాయడుకొనగోటి మీద జీవితంరెక్కల సంతకాలువ్యక్తిత్వం

వ్యాసాలు:

పరిణత వాణి

గేయనాటికలు:

అజంతా సుందరి : 1955లో సినారె ఈ సంగీత రూపకాన్ని రచించారు. 1953లో తన తొలిరచనగా నవ్వని పువ్వు అన్న సంగీత ప్రధానమైన రూపకాన్ని వెలువరించాకా వెనువెంటనే రచించిన రూపకాల్లో ఇదీ ఒకటి. ప్రఖ్యాత అజంతా శిల్పాలను చెక్కే కాలంలో శిల్పుల జీవితాన్ని ఆధారం చేసుకుని రచించిన సంగీత రూపకం.[5]వెన్నెలవాడ

సినీ ప్రస్థానం

ప్రశంసలు

మరణంసవరించు

గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నారాయణరెడ్డి, హైదరాబాద్‌ లోని కేర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 2017జూన్ 12 సోమవారం రోజున ఉదయం తుదిశ్వాస విడిచాడు.[1]

ఇవికూడా చూడండి

మూలాలు

బయటి లింకులు

Last edited 21 days ago by Ajaybanbi

RELATED PAGES

బోయి భీమన్న

విశ్వంభర

అజంతా సుందరి (రూపకం)

అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 3.0 క్రింద లభ్యం

గోప్యతడెస్కుటాప్

No comments:

Post a Comment