Tuesday, 30 May 2017

కాళోజీ మనిషి...

 కవితలో మొదటి భాగం.

మనిషి ఎంత చెడ్డవాడు!
బ్రతికి ఉన్నవాని మంచి
గుర్తించడు కాని వాని
చెడును వెతికి కెలుకుతాడు

మనిషి ఎంత మంచివాడు!
చనిపోయిన వాని చెడును
వెనువెంటనే మరుస్తాడు
కని మంచినె తలుస్తాడు
 మానవుడు అని ప్రకటిస్తూ ఆయన ఒక కవిత రాశాడు.

దేవ దానవుల హయాము లో
శిష్ట రక్షణ దుష్ట సంహారం చేయ
అవతారాలెత్తి యెత్తి
విసుగెత్తిన దేవుడు
మానవుణ్ణి సృష్టించి ఉంటాడు

జరిగిందంతా చూస్తూ
ఎరగనట్లు పడి ఉండగ
సాక్షీ భూతుణ్ణి గాను
సాక్షాత్తూ మానవుణ్ణి

మహాకవి శేషేంద్ర శర్మ వర్ధంతి సందర్భంగా..ఆ కవిని గురించిన సమాచారం...పరిచయం..

ఒక అందమైన పొయమ్ అంటె....
ఒక గుండె ఉండాలి
అది కన్నీళ్ళు కార్చాలి
క్రోధాగ్నులు పుక్కిలించాలి…

ఆధునిక తెలుగు సాహిత్యంలో నూతన ఒరవడిని సృష్టించిన కవి గుంటూరు శేషేంద్ర శర్మ. ఆధునిక కవిత్వానికి ఒక గొప్ప సౌందర్యాత్మకత్వాన్ని కల్పించి,అటు సంప్రదాయాన్ని, ఇటు ప్రగతి శీలతనీ, అటు ప్రాచీన భారతీయ అలంకార శాస్త్రాన్నీ, ఇటు ఆధునిక కాలంలోని మార్క్సిజాన్ని కలగలిపి ఒక నూతన అపురూప సాహిత్య సిద్ధాంతాన్ని ప్రతిపాదించడానికి ఒక మహత్ప్రయత్నాన్ని చేసిన కవి శేషేంద్రశర్మ. యాభైకి పైగా కవితలు పండించి రాసులుగా పోసినా ఆయనకు తీరని దాహమే. షోడశి వాల్మీకి రామయణంలోని సుందర కాండకు వినూత్న తాంత్రిక భాష్యం కూర్చారు. హర్షుని నైషధీయ చరితకు తాంత్రిక వ్యాఖ్యానం రాసారు. ఆయన జర్మనీ ఇండోలాజికల్ రిసెర్చ్ యూనివర్సిటీ ఆహ్వానం మీద వెళ్ళి "కాళిదాసు మేఘదూతానికి, వాల్మీకి రామాయణానికి ఉన్న సంబంధం" అనే సిద్ధాంత వ్యాసం సమర్పించారు. కాళిదాసు అకాడమీ వారి ఆహ్వానం పై "ఇద్దరు ఋషులు - ఒక కవి" అనే శీర్షికతో వాల్మీకి, వ్యాస, కాళిదాసుల కవిత్వానుబంధాల మీద పరిశోధన వ్యాసం సమర్పించారు. నాదేశం - నా ప్రజలు, మండే సూర్యుడు, గొరిల్లా, ఆధునిక మహాభారతం, సముద్రం నా పేరు, శేష జ్యోత్స్న, ఋతుఘోష, కాలరేఖ, కామోత్సవ్, ప్రేమలేఖలు, నా రాష్ట్రం- ఇవి ఆయన రచనలు కొన్నిమాత్రమే..

శేషేంద్ర పుట్టింది నాగరాజుపాడులో. పెరిగిన ఊరు తోటపల్లి,గూడూరు. తండ్రి గుంటూరు సుబ్రహ్మణ్యశాస్త్రిగారు, తల్లి అమ్మాయమ్మ. ఇద్దరూ చదువుకున్నవారే. ఎమ్.బి.బి.యెస్ చదవాలనుకుని బి.ఎ. చేసి లా చదువుతుండగా ప్రభుత్వ ఉద్యోగం వచ్చి మునిసిపల్ కమీషనర్‍గా పని చేసాడు. జర్నలిజం మీద ఉన్న మక్కువతో లా చదువుతుండగానే తాపి ధర్మారావుగారి వద్ద కూడా పని చేసాడు. తొలిసారిగా అచ్చయిన రచన ఒక పాట విశాలాంధ్రలో ముద్రించబడింది.

"ఈ ప్రపంచం ఎక్కడున్నా సరే! 
ధ్రువములకు మధ్య వలె దూరమైనా సరే!
మన బాధలూ ఒక్కటే,
ఎప్పుడూ మన గాధలూ ఒక్కటే…"

శేషేంద్రశర్మలో ఉన్న ఒక మంచి లక్షణం వినమ్రత. చిన్నవాళ్లైనా, పెద్దవాళ్ళైనా ఎంతో మర్యాదగా, హుందాగా మాట్లాడి, వారిని ప్రోత్సహించి, అభినందించేవాడు. తనకంటే ముందున్న కవులను, తనకంటే జ్ఞాన సంపన్నులను గౌరవిస్తాడు ఆయన. వాళ్లు ఏ మార్గానికి చెందినవారైనా సరే. ఆయన ప్రాచ్యసాహిత్యాన్ని బాగా మధించినవాడు. భారతీయ అలంకారశాస్త్రానికున్న పరిమితులన్నీ క్షుణ్ణంగా అధ్యయనం చేసిన పండిత లక్షణం శేషేంద్రలో ఉంది. సంస్కృత భాషా, సాహిత్య పరిజ్ఞానం తో బాటు పాశ్చాత్య సాహిత్యాన్ని, ఫ్రెంచి కవిత్వం మొదలు రకరకాల దేశ దేశాల కవిత్వాన్ని ఆయన లోతుల్లోకి వెళ్ళి పరిశీలించాడు. అనేక భాషల్లొ మాట్లాడగలిగిన ప్రజ్ఞావిశేషం కూడా ఆయనకుంది. పాశ్చాత్య అలంకార లేదా విమర్శ గ్రంధాలకు సంబంధించి గ్రీకు విషాదాంత నాటకాలు దగ్గరనుండి రష్యన్ మార్క్సిస్టు భావజాలంతో నిండిన చాలా పుస్తకాలు చదివి అపారమైన జ్ఞానాన్ని సంపాదించుకున్నారు. వాల్మీకిని, ఉపనిషత్తుల్ని, కాళిదాసుని, గ్రీకు నాటకాల్ని, అరవిందుడిని క్షుణ్ణంగా పరిశీలించిన "కాలరేఖ" వ్యాసాలు అందుకు సాక్ష్యం. అలాగే కవిసేన మేనిఫెస్టోలో ఇచ్చిన ఉదాహరణలు అలవోకగా ఇచ్చాడో చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. 

ఇక కవిత్వంలో అందమైన ఆదర్శాలు..

ఏమని రాశేవు
నిన్ను గురించి ఓ శేషన్
నీకు నిద్ర అంటే
రాత్రి శయ్యలో చేసే సాహస యాత్ర
నీకు కవిత అంటే
క్రూరజీవన రాస్తాల్లో ప్రవేశించే పాత్ర
నీ రాత్రులు
అక్షరాల్లో పోసే ఘోష
ప్రజానీకాల అభివ్యక్తి హీనభాష
ఈ దేశపు మృత్తికలో చల్లావు నీ హృదయాల్ని
నీ రక్తనాళాలు తడుపుతున్నాయి కాగితాల తీరాల్ని
ఈ దేశం నీకిచ్చిన గాయం
నీకు మాత్రం తృణప్రాయం (ఆధునిక మహాభారతము)

ఆటవెలది...

మిథున కవితా వనం.....పద్యతరంగిణి...30-05-2017..

కవిత యనగ యిలలొ. కన్నతల్లి యె తాను
కన్నకూతురైన  కవిత యేగ..
కవిని చూసి కవిత కాంచుట నేలయా.
ఓర్వలేనితనము నోర్వలేను!!

డాక్టర్.శ్యామలగడ్డం....

Wednesday, 24 May 2017

పద్యం..ఆటవెలది...

కన్న బిడ్డ మనసు కన్నతల్లి కెఱుక..
బిడ్డ   నొప్పి నున్న  పేగు కదులు..
కన్నతల్లి ప్రేమ కడుగొప్ప అవునురా,..
కన్నతల్లి మనసు కవిది గూడ..

డాక్టర్.శ్యామలగడ్డం....

భావసుధా చంద్రికలు...విద్యార్ధినులు..

భావసుధాచంద్రికలు...మిథున కవితా వనం...
+++++±±±++++++++++++++++++++++++

పాఠశాలలు ప్రారంభమైనాయి..

తరువాత తరగతిలోకి వెళతామన్న‌.

ఉత్సాహాన్నీ, ఉల్లాసాన్నీ నింపుకుని..

పరుగులాంటి నడకతో, ఉద్వేగంగా..

మిత్రులను కలుసుకున్న ఆనందంతో..

కదులుతున్న చదువరులారా..

చదువే సర్వస్వమై, విఙ్ఞాన కుసుమాలు ఏరుకుంటూ...

నీతి, నిజాయితీ దారంతో దండ గుచ్చి,

విరించి రాణి మెడలో వేద్దామనా!

బయలుదేరారు?

కొత్త విద్యా సంవత్సరంలో సరికొత్త సంకల్పం..

చేపట్టి, ఆశయాల ఆమనిలో విహరిద్దామని.

సాధకులై, పాంథులై బయలుదేరారా విద్యార్ధులారా!!!

కూటికి పేదవైనా, గుణానికి పెద్దవై, ..

విద్యాలక్ష్మిని వెంటనిడుకుని..

ప్రపంచ పాఠశాలలో  బ్రతుకు నేర్పే..

పాఠాలను నేర్చుకుంటూ.....

జీవితం గమ్యాన్ని చేరుకుంటూ..

జీవన సాఫల్యాన్ని. పొందుతావుగా....

ఇంకా నీకేమి తక్కువ...

మహిళా మహరాణివి నువ్వే....

డాక్టర్.శ్యామలగడ్డం....23-05_2017.....

Sunday, 21 May 2017

ఏలలదఁ..

ఏలల దరువుల నడిమిన జనపదమై జన్మించిన తెలుగు కాంత
నన్నయ్య ఇంట  కూతురైనది ముద్దులొలుకుతు తెలుగు కాంత
తిక్కన తియ్యనైన తెలుగు మాటల పూదోటలో పరిమళించు పూవైనది తెలుగుకాంత
ప్రబంధ పరమేశ్వరునితో పంతమాడి కీర్తికాంతయైనది
తెలుగుకాంత
పల్లెపూపొదరిండ్లలో ముద్దుపలుకులతోడ ముదమార శ్రీనాధ కవితకాగ
ఆటపాటగ, కనులకింపుకాగ, మాటలమందారమైనది
పోతన కవితలోన
ముగ్ధ మనోహర రూపమై రమణీయ రాగమై రతనాలసీమలో రాజసముగ
తనతనూవిలాసలతికలతో శింజినీ నాదమై నాట్యమాడెను కృష్ణరాయలింట
ముగ్ధయై, ప్రౌఢయై, ప్రాయంపు కాంతయై, అలకల దేవేరియై అలరించె అలనాటి తెలుగుకాంత
కిన్నెరసానియై,ఊర్వశియై,బాపూబొమ్మయై నడయాడె తెలుగుకాంత
కాలికి గజ్జె కట్టి ఉద్యమగీతమై రాష్ట్రావతరణ సారధియై
సవ్యసాచియైనది తెలుగుకాంత
కవితయై,కావ్యమై  కథగాయై, గజలై ఏకవాక్యమై,నవలై చిట్టి కవితలై పొట్టి కవితలై చిత్ర కవితలై, నానీలై నానోలై
హొయలొలుకుతు కులుకుతున్నది తెలుగుకాంత........

డా.  జి.  శ్యామల.... 31-07-2018

Wednesday, 17 May 2017

ద్విపదఛందస్సు

ద్విపద పద్య లక్షణములు

జాతి(ద్విపదలు) రకానికి చెందినది11 నుండి 15 అక్షరములు ఉండును.2 పాదములు ఉండును.ప్రాస నియమం కలదుప్రతి పాదమునందు 3 వ గణము యొక్క మొదటి అక్షరము యతి స్థానముప్రతి పాదమునందు మూడు ఇంద్ర , ఒక సూర్య గణములుండును

తేటగీతి...పద్యం


.శంకరాభరణము.. సమస్యా పూరణం...

మండు వేసవిలో చెలి మెండు సుమ్మి....
++++++++++++++++++++++++++

రోహిణీ.  కార్తె ఎండలో  రోళ్ళు  పగల ..
వడను మాడిఅసువులు బాయగ జనులును..
వాడిగ వడగళ్ళతొ వానయు  కురియగను.
మండువేసవిలో చలి మెండు సుమ్మి..

డాక్టర్.శ్యామల గడ్డం..

పాల్కురికి సోమన...

మతపరిస్థితులు: సాహిత్యం సామాజిక జీవన ప్రతిబింబ మని విజ్ఞుల భావం సామాజిక పరిస్థితుల్ని బట్టి సాహిత్య దృక్పథం కూడా పరిణామం చెందుతూ ఉంటుంది. ప్రాచీన సాహిత్యం ఎక్కువ భాగం మత దృక్పథంతోనే వెలువడింది. సమాజంలో జైన బౌద్ధాల ప్రభావం మితిమీరిపోయినపుడు వైదిక మత పునరుద్ధరణ కోసం పంచమ వేదంగా నన్నయ మహాభారతాన్ని రచించాడు. కాకతీయులు మొదట జైనులుగానే ఉండి తర్వాత బసవడు స్థాపించిన వీర శైవ మతాన్ని అనుసరించారు. పాల్కురికి వేద ప్రమాణాల్ని నిరసిస్తూ, వీరశైవం వేద విహితమైనదని తన రచనల్లో చెప్పాడు.
వీర శైవ మతము: వీరశైవులు, తక్కిన శైవ సంప్రదాయాల కన్న వైదిక మతాన్ని ఎక్కువగా నిరసించారు. వీర శైవం సంఘ సంస్కరణకు నాంది పలికింది. కుల విధానాన్ని వ్యతిరేకించింది. శూద్రులకు పంచములకు కూడా కావ్య గౌరవం కలిగించింది. స్త్రీ, పురుషుల సమానత్వాన్ని చాటి చెప్పింది. వీర శైవ కవుల్లో అగ్రగణ్యుడు పాల్కురికి. శివుణ్ణి పరమదైవంగా భావించే మతం శైవం. శైవులు 'ఏక ఏవరుద్రో' అని శివుడొక్కడే దేవుడని చాటుతారు. శివుడు సగుణ నిర్గుణ పరబ్రహ్మ. కాశీ యందు విశ్వేశ్వరుడు శ్రీశైలమందు మల్లికార్జునుడు, హిమాచలమందు గౌరీశంకరుడు. ఈ శైవాలయాలు శైవ వ్యాప్తిని తెలియజేస్తున్నాయి. శివునికి ఇతరులు సరిరారని సోమన ''శంకర దాసయ్య'' కథలో పేర్కొన్నాడు.
బసవేశ్వరుడు కర్ణాటక దేశంలో వీరశైవమును స్థాపిస్తే ఇతని చరిత్రను మొదట తెలుగులో బసవపురాణంగా పాల్కురికి సోమనాథుడు రచించగా తరువాత ఇది కన్నడములోనికి భాషాంతరీకరణ పొందింది. అదేవిధంగా పండితారాధ్య చరిత్ర కూడా కన్నడ భాషలోనికి తెలుగు నుండే ప్రయాణము చేసింది. శివకవుల మతావేశమునకు ఉదాహ రణగా బసవ పురాణములో ఒక సంఘటనను ఉదహరిం చవచ్చును. శివభక్తుడైన భృంగి ఒకమారు శివుని దర్శింప బోయెను. ఆ సమయంలో శివుడు పార్వతీ సమేతుడై ఉండగా శివునికి మాత్రమే నమస్కరించి భృంగి వెనుదిరిగి పోయెనట. శివునికే తప్ప ఇతరుల ముందు శిరస్సు వంచని మతావేశము వీరిది. పైవిధంగా సోమనాథుని రచనలు వీరశైవ మత స్వరూపం మత విద్వేషాలు, మత సంప్ర దాయాలు ప్రతిఫలిస్తూ ఆనాటి మత పరిస్థితుల్ని అవగాహన చేసుకొనుటకు దోహదమౌతున్నాయి. జాతి బేధాలకు ఏ మాత్రం తావివ్వని వీరశైవమతాన్ని పాల్కురికి సోమన అనుసరించాడు.

ఆటవెలది...17-05-2017

చెట్టు కొట్ట బోకు  చింతయె దరిచేరు.
హరిత వనము మనకు ఆయు విచ్చు.
చిట్టి పక్షి గూడ  చెట్టునాధారమౌ
చెట్టు మనకు గొప్ప చెలిమి ఱేడు

Tuesday, 16 May 2017

పద్యతరంగిణి..17-05-2017

పద్యం తరంగిణి..17-05-2017..

పలుకు స్వాగతంబు పర్వదినములందు.
గడప తోరణముగ  గాలి   స్పర్శ  తగల
కూరు చుండు వాలు కుర్చీగ  మారుగా..
చెట్టు మనకు గొప్ప చెలిమి రేడు..

డాక్టర్.శ్యామల గడ్డం..

పద్యతరంగిణి....16-05_2017...

పద్యతరంగిణి... మిథున కవితా వనం..
దత్తాంశం...చెట్టు మనకు గొప్ప చెలిమి రేడు...

నీరు లేక తాను నిలువనే నిలువదు.
మనకు నీడనిచ్చు మనకు తోడు.
వసుధ తడియె లేదు వానజాడయెలేక.
చెట్టు మనకు గొప్ప చెలిమి రేడు...

డాక్టర్.శ్యామలగడ్డం..16-05-2017

ఆటవెలది పద్యం....16-05-2017

పద్యతరంగిణి.... మిథున కవితా వనం....
++++++++++±±+++++++++++++++

చెట్టు కలిమి, బలిమి, చైత్రమాసమువలె
తరువు  ఉన్న  యెడల  కరువు   లేదు
కొరత యేమి  మనకు  కల్పవృక్షముభంగి.
చెట్టు.  మనకు   గొప్ప   చెలిమి   రేడు....

డాక్టర్.శ్యామలగడ్డం,...16-05-2017

Monday, 15 May 2017

గజల్..15-05-2017..

గజల్ చిత్రం..21..  రచన.డా.శ్యామల గడ్డం...15-05-2017...

తెలుగింటిలొ ఆడపడుచు  నిలిచినట్లు ఉందేమిటి..
స్వచ్ఛమైన     మల్లె పువ్వు విచ్చినట్లు ఉందేమిటి..

సంబరాల జాతరేదొ  వదనమందు కదలాడగ..
అంబరాన  వెలుగుచుక్క పూసినట్లు ఉందేమిటి..

చిరునవ్వుల ముత్యాలను  ఏరుకొనుట అసాధ్యమే.
హాసములే వరములుగా ఇచ్చినట్లు ఉందేమిటి..

బావరాక  వర్తమానమందెనేమొ  లేఖలోన..
పరవశమే హృదయాన్నీ  తాకినట్లు ఉందేమిటి..

చిత్తరువుగ నిలుచుండగ  భావమేమి మదిలోనా
చిత్రముగా మూగప్రేమ ముసిరినట్లు ఉందేమిటి...

నీ హృదిలో    భావాలూ శ్యామతోన   పంచుకోవ..
పలుక గాను నునుసిగ్గులు  పొరలినట్లు ఉందేమిటి...

డాక్టర్.శ్యామల గడ్డం...

Wednesday, 10 May 2017

పల్లె కన్నీరు బెడుతుందో....

పల్లె కన్నీరు బెడుతుందో...కనిపించని కుట్రల
నా తల్లీ  బంది అయి పోతుందో కనిపించని కుట్రల
కుమ్మరి వాములో తుమ్మలు మొలిచెను
కుమ్మరి కొలిమిలో దుమ్ము లేచెను 
సాలెల మగ్గము సడుగులిరిగినవి 
పెద్ద బాడిశ మొద్దుబారినది 
చేతివృత్తుల చేతులిరిగినాయో....నా పల్లెల్లోన 
గ్రామ స్వరాజ్యం గంగలోన మునిగే.....

మడుగులన్ని అడుగంటిపోయినవి 
బావులు సావుకు దగ్గరైనవి 
వాగులు వంకలు ఎన్దిపోయినవి 
సాకలి పొయ్యిలు కులిపోయినాయ్
పెద్దబోరు పొద్దంతా నడుస్తుందో - గా బలిసిన దొరలది 
బక్క రైతులా బావులేన్డినాయో నా పల్లెల్లోన

జానపదసాహిత్యము

      telugudanam.co.in

   

జానపద సాహిత్యం

 

కూని రాగాలాపనతో ప్రకృతి లయకు అనుగుణంగా వచ్చిన గానం భాషా సంపర్కంతో గేయంగా రూపొంది మానవ మనుగడకు సంబంధించిన వివిధి దశలకు రూపులో మార్పు, కూర్పులో చేర్పులు పాత ఒరవడిలో కొత్త పదములు కొత్తజీవనానికి పాత బాణీ మొదలగు చేర్పులు, మార్పులు కూర్పులతో నిత్యం సరికొత్త రూప సాక్షాత్కారమిచ్చే జానపద వాజ్ఞ్మయం నిత్యనూతనమైందిగా ప్రశస్తికెక్కినది. జానపద వాజ్ఞ్మయం శాఖోపశాఖలుగా విస్తరిల్లింది. మౌఖిక సంప్రదాయంలో జీవించడం మూలంగా దీనికి ఒక క్రమమైన పరిణత స్వరూపు కానరాము. వినుకలియే సాధనంగా మనుగడ సాగిస్తాయి కనుక జానపదుల కవుల కల్పనా పటిమలొ ఒక పదానికి మరో పదము, ఒకపాద పంక్తికి మరో పదసంపుటి సమాహారం. ఒక సన్నివేశమునకు మరో రసఘటిక, ఒక పదకేళికి ధీటుగా మరో ప్రహేళిక, ఒక సామెతలొ మరో సామెత, ఒక కధలో మరో సాంఘిక ఆచారము ఒక కోలాటంపాటలొ మరో భావకెరటం కాలానుగుణంగా కవి భావనా వీచికాలను సంథానంగా మారుతూ కొత్త చవులను విరజ్జిల్లుతుంది జానపద సాహిత్యము. 

శిష్టసాహిత్యంలో కవి నైపుణ్యానికి కవితాగుణ మాధుర్యానికి ఉదాత్త పాత్ర చిత్రణకు, రణపోషణకు, ఇతివృత్త స్వీకారమునకు పొంతన ఉంటుంది. అనగా కవి నిరంకుశుడనే మాట ఉన్నా అతని కవిత్వము కొన్ని పరిధులకు లొంగి ఉంటుంది. జానపద సాహిత్యమైతే ఒక ప్రత్యేకమైన కవి ఉండడు. మౌఖిక సంప్రదాయములో జీవిస్తుంది గనుక ఒక స్వరూపము గాని శాశ్వత పదపోహళింపుగాని కనపడదు. ఒక తరం నుండి మరో తరానికి సంక్రమిస్తూ నిత్యనూతనముగ దర్శనమిచ్చే జానపద సాహిత్యం స్వేచ్చా విహారిణి. అనగా విచ్చలవిడిగా న్వైరవిహారము చేసేదని మాత్రము కాదు. సాంప్రదాయకపు కట్టుబాట్లకి లొంగక పని పాటల క్రమమునకు మాత్రము ఒదగి ఆ లయ కనుగుణంగా సాంఘిక జీవన ప్రతిఫలమునకు జాతి సంస్కృతి ఆచార సంప్రదాయములు, మత విశ్వాసములు, మూఢనమ్మకాలు మొదలగు అంశములను కళ్ళకు కట్టినట్లు కనబరుస్తూ తరువాతి తరాలవారికి మనోహరంగా దర్శనమిచ్చేది జానపద సాహిత్యము. మానవుడి మనసులోని భావముకు శాబ్దికరూప సందర్శనమే జానపద సాహిత్యం. దీనిపై ఏ సిద్ధాంతముల ప్రభావము ఉండదు. ఉచ్చ్వాస నిశ్వాసములవలె ప్రకృతి శోభల రసస్రవంతిల మృదుమధురంగా సాగేదే జానపద సాహిత్యం. దీనికి ఏ చందశ్శాస్త్రము, ఏ వ్యాకరణము, ఏ అలంకారిక శాస్త్రము అడ్డురాదు. ఏ సూత్రములు నిర్ధేశించలేవు. చేసే పనితూగునకు ఆడే ప్రతి ఆట విశ్వామునకు ఊపే ప్రతి ఊయల ఊపునకు, ఊరడించే ప్రతి తల్లి గొంతు ఒరవడికి, ఊరడిల్లే ప్రతి శిశువు కేరింతకు, ఊకొట్టే మనవడి హృదయస్పందనకు రూపుగొల్పే అమ్మమ్మ తాతగార్ల కధా కధన సంవిధానికి అనుగుణమైన ఆయా లయల హోయలులో ఒదిగిన పదబంధ విన్యాసమే జానపద సాహిత్యము, అంటే చేసే పని లయకు సంధించి మాత్రమే జానపద వాజ్ఞ్మయం పుడుతుందని అర్ధము. అంతేగాని న, జ, భ,జ,జ జ, రాది మొదలగు గణములచే స్వరూపం సంతరించుకున్నది మాత్రము కాదు. అలంకారికుల మతమునకు అనుసరించి వచ్చేది శిష్టసాహిత్యం అవుతుంది. ఈ సాహిత్యమునకు ఏ లక్ష్ణములున్నవో తెలుసుకోవడామే మన వంతు కాని ఏ సామెతకు ఈ లక్ష్ణముండవలెను, ఈ పొడుపు కధను ఈ విధముగనే పాడవలెను, ఈ గేయము ఈ విధముగనే పాడవలేననే నియమము లేదు. విధించే హక్కు ఎవరికిని లేదు. ప్రకృతిలో పూచి, కాచి, పండిన అమృతఫలాన్ని తనివితీరా అనుభవించడం ఎటువంటిదో జానపద సాహిత్యాన్ని తనివితీర్చుకోవడం అటువంటిదే. అనగా జానపద సాహిత్యము ప్రకృతి నిసర్గ మనోహరమైన సౌందర్యరాశి అని గమనించాలి. 

జానపద వాజ్ఞ్మయాన ప్రశస్తమైన స్ధానము సముపార్జించుకున్నది జానపద గేయము. అసలు జానపద వాజ్మయమంటే గేయమే చాలామంది స్ఫురణకు వస్తుంది. సాహిత్యములోని మిగతా ప్రక్రియలకంటే జానపద గేయానికి ఉచ్ఛ స్ధానము ఉండటానికి గల కారణం దానికి గల గానయౌగ్యతయే. 'సంగీతమపి సాహిత్యం సరస్వత్తాంతనద్వయం ఏకమాపాత మధురం అన్యదాలొచనామృతం ' అనికదా ఆర్యోక్తి. ఇది జానపద గేయమునకు సర్వవిధాలా సరిపోతుంది. సాహిత్యం భావాశ్రితమైతే గేయం గానానుకూల్యమైనది. అనగా గేయమున సాహిత్యపరమైన పదబంధముతో పాటు సంగీతపరంగా గానానుసంధానము కూడా కలదు. కాబట్టి సంగీత సాహిత్యముల కంటే గేయ ప్రక్రియకు వన్నె తెచ్చిన విషయాలలొ సంగీతాశ్రయమనేదే ముఖ్య గుణము. 

ఇతర జానపద వాజ్ఞ్మయ శాఖలకంటే ; గేయశాఖ జానపదుల జీవికతో ఎక్కువ ముడిపడి ఉంది. జానపదుల దైనందిన కార్యక్రమాల అన్నింటితోను పెనవేసుకొని ఉన్న గేయము శాఖోవశాఖలుగా ప్రవల్లినది. స్త్రీ పురుష బాల వృద్ధ భేదములతో సంబంధము లేక అన్ని వయసులవారి నోళ్ళలో నిత్యమూ నానుతూ నవనవోన్మేషశాలినిగా కొత్త పుంజులతో హొయలు సనలు వెలార్చుతూ ఉంటుంది. కనుక అన్ని భేదములతో జానపద గేయము మనకు గోచరమవుతుంది. స్ధానిక ఘట్టములేగాక పౌరాణికేతి వృత్తములు, వీరుల తలపోతలు, అద్భుత సన్నివేశములు, దేవతా మహాత్మ్యములు, పేరంటాళ్ళ మహాత్మ్యములు మొదలగునవెన్నో సందర్భములు, సన్నివేశములు చోటుచేసుకునే వున్నాయి. గేయగాధలు, వీరగాధలు, అద్భుత గాధలు మొదలగు విధమగా కధాసహిత గేయ పాయగా ఒక ప్రత్యేకమైన స్ధితిని సంతరించుకున్నవి అప్పటికప్పుడు అలవోకగా ఆయా సందర్భములను అసరాగా, ఆలంబనగా చేసుకొని అను నిత్యము కొత్త అందాలను పంచిపెట్టే చిన్న చిన్న గేయాల సంఖ్యే ఎక్కువ. వీటిలో ఏ రకమైన ఇతి వృత్తము చోటుచేసుకోదు. కాని సన్నివేశాల ఆధారంగా సెలయేరు గలగలతో తెప్పలు తెప్పలుగా కుప్పలు కుప్పలుగా శరపరంపరగా వుడుతూ ఉంటాయి.ఈ చిన్న గేయములు. చల్‌ మోహనరంగా. సిరిసిరిమువ్వా, తుమ్మెద పదాలు, వెన్నల పదాలు, గొబ్బి పదాలు, నక్కలోల్ల చిన్నది, గాజులదాన్ గాజులదాన్, వంకీల జుట్టుదానా, కిర్రుజోళ్ళ చిన్నోడు లాంటి గేయాలెన్నో కోకొల్లలు. 

జానపద గేయం వైవిధ్యము గల ప్రక్రియ. ఇటు కధా గేయాలకెంత ప్రాధాన్యముందో అటు కధారహిత గేయాలకు అంతే ప్రచారమున్నది. ఆచార్య బి. రామరాజుగారి అధ్యయనమే ఇప్పటికి శిరోధార్యమైంది. వీరి ప్రకారము జానపద గేయము 1.పౌరాణిక గేయాలు 2. చారిత్రక గేయాలు 3. మతసంబంధ గేయాలు 4. పారమార్ధిక గేయాలు 5. స్త్రీల పాటలు 6. శ్రామిక గేయాలు 7. పిల్లల పాటలు 8. శృంగార గేయాలు 9. అద్భుత రసగేయాలు 10. కరుణరస గేయాలు 11. హాస్యరస గేయాలు.

పౌరాణిక గేయములు:-

వీటిని మరల మూడు ముఖ్యమైన భేదాలుగా విభజించవచ్చు.అవి రామయణ భారత భాగవత సంబంధాలు. 

శ్రీరామ పట్టాబిషేకము, ఊర్మిళదేవి పాట, లక్ష్మణదేవనవ్వు పాట, సీతమ్మ అగ్ని ప్రవేశము, కోవెల రాయబారము మొదలగునవి రామాయణ సంబంధములుగాను, సుభద్ర కల్యాణము, శశిరేఖా పరిణయము, విరాటపర్వాంతర్గత కీచక వధ మొదలగునవి భారత సంబంధములుగాను, శ్రీకృష్ణ జననము, కాళిందిమడుగు, గుమ్మడిపాట, రుక్మిణిదేవి కల్యాణము, రుక్మిణిదేవి సీమంతము, కుచేలోపాఖ్యానము మొదలగునవి భాగవత సంబంధ గేయములుగా అనసూయదేవి బ్రతుకమ్మ పాట, దత్తాత్రేయ జననము, గోవుపాట మొదలగునవి కూడా పౌరాణికములే.

చారిత్రక గేయములు:-

విపుల వర్ణలతోను విస్తృత ప్రచారములోను ఉండడమే గాక వీరుల చారిత్రక ఘట్టములకు ప్రాధాన్యత వహించిన సుదీర్ఘములైన గేయములను చారిత్రక గేయాలని చెబుతారు. వీటినే వీర గాధలని జానపద విజ్ఞాన పరిధిలో చెపుతారు. ఇవి మహావీరగాధలు, లఘువీర గాధలని రెండు విభాగములు. ఆంధ్రదేశమున పౌరుషాగ్నులు రగిల్చిన పలనాటి వీరుల గాధలు 'పలనాటివారి సుద్దులు' గా ఇప్పటికీ పాడుకుంటూనే ఉన్నారు మన జానపదులు. అందులోని బాలచంద్రుని యుద్ధ ఘట్టము అమిత ప్రచారం పొందింది.. కోళ్ళ పోట్లాట, కన్నమనేని యుద్ధము, గురజాల యుద్ధము, అలరాజు రాయబారము, కొమ్మనాయుని యుద్ధము, బ్రహ్మనాయుని విరుగు మొదలగు ఘట్టములు ఆంధ్ర ప్రజానీకము నాలుకల పై నిత్యము నానుతూనే ఉన్న గాధలు పలనాటి వీరచరిత్రను లిఖించినది శ్రీనాధుడే. పలనాటి వీరచరిత్ర పేరుతో నేటికి ఎన్నో నాటకములు.బుర్రకధలు మొదలగు ప్రక్రియ భేదములతో దిగ్దిగంతముల పలనాటి విరుల పరాక్రమౌపేత సన్నివేశములు మారుమ్రౌగుచునే ఉన్నాయి. అదేవిధముగా కాటమ రాజు కధ, సర్వాయి పాపని కధ, వేసంగిరాజు కధ, అల్లూరి సీతారామరాజు కధ, బంగారు తిమ్మరాజు కధ, ఆరు మరాటీల కధలు విపుల ప్రచారమునందినవే. బొబ్బిలి కధ, తాండ్రపాపారాయని తళతళల బాకు వాదరను ఆంధ్ర ప్రజానీకము నిత్యము స్మరించుకుంటూనే యున్నారు,

మత సంబంధ గేయములు :-

వీటిని మరల శైవ వైష్ణవాలుగా విభజించడం జరిగింది. గంగా వివాహము, గంగా గోరి సంవాదము, సవతుల కయ్యము,సురాభాండేశ్వరము మొదలగునవి శైవసంబంధములు, లక్ష్మీదేవి సొగటా లాట, వేంకటేశ్వరుల వేట, చెంచీత కధ, చిన్నను కధా ముదలగునవి వైష్ణవమత సంబంధ గేయ కోవలోకి వస్తాయి.

పారమార్ధికములు :-

ఇవి మరల మూడు భేదములు. భద్రాచల రామదాసు కీర్తనలు, కాలేమస్తాను దేవుని కీర్తనలు, రాపాక కవుల కీర్తనలు, కోలాట కీర్తనలు మేలుకొలుపులు, మంగళహారతులు భక్తిగేయములుగను ఏగంటివారి వచనములు వేమన తత్త్వము, రామదాసు శతకము, పోతులూరి వీరబ్రహ్మం తత్త్వములు, తారకమృతసారము, ి వేదాంత సంబంధములుగా నోములు, వ్రతములు, తులసీదళము పాట, రామేశ్వరము పాటలు, ఏకాదశి వ్రతంపాట, బ్రతుకమ్మ పాటలు, ఎల్లమ్మ కధలు మొదలగునవి కర్మమార్గానికి సంబంధించిన గేయములుగా వర్గీకరింపబడ్డాయి.

స్త్రీల పాటలు :-

లాలి పాటలు, జోలపాటలు, పెళ్ళి పాటలు, సీత సమర్త, సీతనత్తవారింటికి పంపుట, సీత గడియ, సీతమ్మ వారి వసంతం, సీతాదేవి వామనగుంతలాడు పాట, సుభద్ర సారె, అత్తాకోడండ్రు ఆరళ్లు మొదలగునవి ఈ శాఖలలో వివరింపబదినవి.

శ్రామిక గేయములు :-

పడవ పాటలు, రాట్నము పాటలు, తిరుగలి పాటలు, రోకటి పాటలు, ఏతముపాట, మోట పాట ,ఏరువాక. పొలి మొదలగు కృషివళుల పాటలు, కార్మికుల పాటలు, వృత్తుల పాటలు మొదలగునవన్నీ ఈ కోవలోకి వస్తాయి.

పిల్లలు పాటలు :-

పిల్లల కొరకు ఉద్దేశింపబడిన పాటలు, పిల్లలు తామే అల్లుకొన్న పాటలు, ఆటపాటలు పాటలు గేళిచేయు పాటలు మొదలగునవి.

శృంగార గేయాలు :-

వెంకయ్య చంద్రమ్మ పాట, చల్ మోహనరంగ, సిరిసిరిమువ్వ పదము, గోంగూర పాట, నారాయణమ్మ పాట, బంగారుమామపాట, కోలాటపాటలు, కామినిపాటలే గాక పౌరాణిక చారిత్రక, కరుణ, అద్భుత, రస ప్రధాన గేయములు మతసంబంధ గేయములలోన శృంగార రస ఘట్టములు మొదలగునవి.

అద్భుతరస గేయాలు :-

బాలనాగమ్మ కధ, కమ్మవారి పణత, పనల బానరాజు కధ,గాంధారి కధ, కాంభోజరాజు కధ, ధర్మాంగద చరిత్ర, పాము పాట బాలరాజు బతుకమ్మ పాట మొదలగునవి.

కరుణరస గేయాలు :-

కామమ్మ కధ, లక్ష్మమ్మ కధ, సన్యాసమ్మ కధ, వీరరాజమ్మ కధ, ఎరుకలనాంచారి కధ మొదలగునవి.

హాస్యపు పాటలు :-

పౌరాణిక, చారిత్రక, మతగేయములందున్న హాస్య సన్నివేశములు, హాస్యానుకృతులు, వాక్ చమత్కృతి గల కొన్ని పాట ఈ కోవలోనికి వస్తాయి. 

ఈ సందర్భంగా ఒక్క అంశమును మాత్రము చర్చించుకోవలసి ఉంది, మొత్తం జానపద గేయములు నన్నింటినీ రెండే రెండు విభాగములుగా విభజించవచ్చును. 1. శ్రామిక గేయాలు 2.శ్రామిక గేయేతరములు. ఎందుచేతనంటే నూటికి 70 మంది జన పదాలలొ శ్రామికులుగా వివిధ వృత్తులు చేపట్టిన కార్మికులుగా ఉన్నవారే. 

జానపద గేయములలో సగానికి పైనే శ్రామిక గేయములున్నవని వాటికి మరింత విరివిగా సేకరించి ఆదరించాల్సిన అవసరం ఉందని అదే అసలుసిసలైన జానపద గేయమనేది కూడా నిర్ధారణకు వచ్చిన విషయము.

వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: 

Saturday, 6 May 2017

శంకరాభరణం సమస్య...

" శంకరాభరణం గారి  సమస్య "
"డాండడ డాండాం డడాండ డామ్మనె వీణెళ్ "
అనే సమస్య పాదమును..

పాండవ క్షేమము కోరియు
పాండుసుతునకు  హరుడీయ.పాశుపతంబున్
పాండవ మధ్య ముడు పొందె.
డాండడడాం డాం డాం డడాండ డామ్మనె వీణల్....

డా. శ్యామల గడ్డం...06-05-2017...

" శంకరాభరణం గారి  సమస్య "
"డాండడ డాండాం డడాండ డామ్మనె వీణెళ్ "
అనే సమస్య పాదమును

మిత్రులు Thopella Bala Subrahmanya Sarma
గారి ప్రోత్సాహంతో నేను పూరించిన
సమస్యా పూరణ పద్యం
కం.
ఖాండవ దహనపు వేళలొ
కాండము లడుగంటుదాక కాలుచు కూలెన్
ఖాండవ సుమవని హృదయపు
డాండడ డాండాం డడాండ డా మ్మనె వీణెల్

Wednesday, 3 May 2017

హైకూలు.. యదుకులభూషణ్...

EEMAATA: AN ELECTRONIC MAGAZINE IN TELUGU FOR A WORLD WITHOUT BOUNDARIES

ఈమాట గురించిపాతసంచికలుశీర్షికలుకథలుకవితలుపద్యసాహిత్యంవ్యాసాలుసమీక్షలుస్వగతంగడినుడిశబ్దతరంగాలుముఖాముఖిసూచనలుపాఠకులకు సూచనలురచయితలకు సూచనలుఈమాట రచయితలుపాఠకుల అభిప్రాయాలు

హైకూలు

రచన: తమ్మినేని యదుకులభూషణ్

కవితలు» జూలై 2001

పూవుల రంగులన్నీ లాగేసుకొని
పారిపోతాడు సూర్యుడు
నల్లని రాత్రి!

పొద్దెక్కి లేచాను
చెల్లాచెదురుగా ఎండ
అడక్కుండా ప్రవేశించేది ఇదొక్కటే

చీకట్లో నల్లపిల్లి మ్యావంది
తను కనిపించదని
దానికి తెలుసేమో !

ఆకులు రాల్చిన చెట్టు
క్రిందవికసించిన పూవు
అందరిచూపూ దానిమీదే..

ఏవి ఎక్కడ వుండాలో
అవి అక్కడే వున్నాయి
అదే ఇబ్బంది!

మళ్ళీ ఎదురుపడ్డానని
నవ్వుతోంది కుర్రది
నవ్వక తప్పింది కాదు

రచయిత తమ్మినేని యదుకులభూషణ్ గురించి: తమ్మినేని యదుకుల భూషణ్‌ జననం రాయలసీమలోని చారిత్రకస్థలం తాడిపత్రిలో. కొన్నాళ్ళు సింగపూర్‌లో పనిచేసారు. నివాసం సోమర్‌సెట్‌, న్యూజెర్సీలో. "నిశ్శబ్దంలో నీ నవ్వులు" అనే కవితాసంకలనం ప్రచురించారు. కథలు, విమర్శలు కూడా రాసారు.  ...

    

   

మీ అభిప్రాయం తెలియచేయండి

పేరు*   ఈ-మెయిల్*

URI

    English  తెలుగు ( సహాయం ) 

      

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను. 

ఈ రచయిత నుంచే...

ఇస్మాయిల్ అవార్డు – 2014నిదురపో చిన్నీ…అరణ్య కవితలుచెట్టూబాలుడుతడిచేతుల సముద్రం

ఇటువంటివే…

హైకూలురెండు హైకూలుహైకూలుహైకూలుమలబారు !

జూలై 2001 సంచికలో ...

సంపాదకీయంతానా కథాసాహితి 2001 కథల పోటీలు విజేతలుసమీక్షలు“అంటరాని వసంతం” నవలఅమెరికా తెలుగు కథానిక 6తానా కథాసాహితి 2001 తెలుగు నవల కథానిక పోటీ సమీక్షాపత్రంసీతారాముడి “శివదర్పణం”కథలుటైటానిక్‌అస్తిత్వానికి అటూ యిటూ …క్లబ్బులో చెట్టు కథతమాషా దేఖో 8ది ట్రాప్‌నీడమారిన కాలం, మారని మనుష్యులువినాయక చవితి కథకవితలుఒక్క ప్రశ్నజ్ఞాపకంపద్యం కోసంపీకమంచులో తడిసిన ఉదయంశిశిరం లో చెట్టుశ్రీ వరసిద్ధి వినాయక పద్యమాలహైకూలువ్యాసాలుఅన్నమయ్య సంకీర్తనల్లో కవిసమయాలుగతమెంతొ ఘనకీర్తి కలవాడా!తానా 2001 సభలు కొన్ని సాహిత్య కార్యక్రమాల వివరాలుతెలుగు సినిమా పాటకి సుతీ మతీ లేవా?నృపాలంలో ఎండాకాలంఅనువాదాలువిశ్వకవిత:విస్లావా జింబోస్కా

© ఈమాట

ఈమాట రచయితలు About eemaata

ఈమాట – ఫేస్�బుక్ మీ రచనలు పంపించండి సంపాదకులను సంప్రదించండి RSS ఫీడ్ వెతుకు

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.

LOADING...

హైకూలు..నిర్మాణం....

ప్రధాన మెనూను తెరువు

సవరించుఈ పేజీ మీద కన్నేసి ఉంచు

హైకూ

హైకూ అనునది ఆధునిక తెలుగు కవిత్వ ప్రక్రియ. జపనీ సాహిత్యంలో విశేష ఆదరణ పొందిన ఈ ప్రక్రియ తెలుగులోకి దిగుమతి అయింది.

నిర్మాణంసవరించు

హైకూ మూడు పాదాలలో పదిహేడు 'మాత్రలు ' ( సిలబుల్స్) కలిగిన త్రిపద. మొదటి పాదంలో ఐదు, రెండో పాదంలో ఏడు, మూడో పాదంలో ఐదు చొప్పున మాత్రలు ఉంటాయి.

ప్రత్యేకతసవరించు

సాధారణ విషయాలలో అద్భుతాన్ని చూపగల ప్రక్రియ. ఏ ఆలోచన చేయకుండా ఒక దృశ్యాన్నో, సంఘటననో చూసి కవి మెరుపు వేగంతో చెప్పే ప్రక్రియ. మానవాత్మనీ, భూమ్యాకాశాల్ని, వెలుగునీడలను ఒకే స్నాప్ షాట్ లో పట్టే ప్రక్రియ అంటారు ప్రముఖ సాహితీకారులు వాడ్రేవు చినవీరభద్రుడు. కొలనులోకి రాయి విసిరితే వృత్తాలు వ్యాపించినట్లు హైకూ పాఠకునిలో ఆలోచనాతరంగాలను సృష్టిస్తుంది.

తెలుగు హైకూల చరిత్రసవరించు

తెలుగులో హైకూలను పరిచయం చేసింది ఇస్మాయిల్ (కవి) గారు[1]1991లో పెన్నా శివరామకృష్ణ ' రహస్యద్వారం ' పేరుతో తొలి తెలుగు హైకూ కవిత్వ సంపుటిని తీసుకవచ్చాడు. "చినుకుల చిత్రాలు" (2000), "సులోచనాలు" (2006) పేర్లతో మరో రెండు హైకూ సంకలనాలను కూడా పెన్నా శివరామకృష్ణ ప్రచురించాడు. ప్రపంచంలోని, భారత దేశంలోని వివిధ భాషలలో వచ్చిన కొన్ని హైకూలను తెలుగులోనికి అనువదించి "దేశదేశాల హైకూ" (పాలపిట్ట బుక్స్ ప్రచురణ, 2009) అనే మరో అనువాద రచనను కూడా పెన్నా శివరామకృష్ణ వెలువరించాడు. "ప్రపంచ వ్యాప్త కవితా ప్రక్రియ హైకూ", "హైకూ - స్వరూప స్వభావాలు" అనే శీర్షికలతో పెన్నా శివరామకృష్ణ రాసిన రెండు వ్యాసాలు కూడా "దేశదేశాల హైకూ" పుస్తకంలో ప్రచురింపబడినాయి. 1994లో గాలి నాసరరెడ్డి జపాన్ హైకూలను తెలుగులోకి అనువదించారు. ప్రస్తుతం తలతోటి పృథ్విరాజ్ ' ఇండియన్ హైకూ క్లబ్ ' ని స్థాపించి ఈ ప్రక్రియకు విస్తృత ప్రచారం కల్పించి, విరివిగా రాస్తున్నారు. హైకూ సంకలనాలు, అవార్డు లు ప్రదానం చేస్తున్నారు. బి.వి.వి. ప్రసాద్, లలితానంద ప్రసాద్, వెంకటరావు, హైకూ వరలక్ష్మి మొదలగు తెలుగు కవులు హైకూలు రాస్తున్నారు.

కొన్ని హైకూలు

మూలాలు

Last edited 15 days ago by Talathoti

RELATED PAGES

కవి సంగమం

తలతోటి పృథ్విరాజ్

పెన్నా శివరామకృష్ణ

అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 3.0 క్రింద లభ్యం

గోప్యతడెస్కుటాప్