మతపరిస్థితులు: సాహిత్యం సామాజిక జీవన ప్రతిబింబ మని విజ్ఞుల భావం సామాజిక పరిస్థితుల్ని బట్టి సాహిత్య దృక్పథం కూడా పరిణామం చెందుతూ ఉంటుంది. ప్రాచీన సాహిత్యం ఎక్కువ భాగం మత దృక్పథంతోనే వెలువడింది. సమాజంలో జైన బౌద్ధాల ప్రభావం మితిమీరిపోయినపుడు వైదిక మత పునరుద్ధరణ కోసం పంచమ వేదంగా నన్నయ మహాభారతాన్ని రచించాడు. కాకతీయులు మొదట జైనులుగానే ఉండి తర్వాత బసవడు స్థాపించిన వీర శైవ మతాన్ని అనుసరించారు. పాల్కురికి వేద ప్రమాణాల్ని నిరసిస్తూ, వీరశైవం వేద విహితమైనదని తన రచనల్లో చెప్పాడు.
వీర శైవ మతము: వీరశైవులు, తక్కిన శైవ సంప్రదాయాల కన్న వైదిక మతాన్ని ఎక్కువగా నిరసించారు. వీర శైవం సంఘ సంస్కరణకు నాంది పలికింది. కుల విధానాన్ని వ్యతిరేకించింది. శూద్రులకు పంచములకు కూడా కావ్య గౌరవం కలిగించింది. స్త్రీ, పురుషుల సమానత్వాన్ని చాటి చెప్పింది. వీర శైవ కవుల్లో అగ్రగణ్యుడు పాల్కురికి. శివుణ్ణి పరమదైవంగా భావించే మతం శైవం. శైవులు 'ఏక ఏవరుద్రో' అని శివుడొక్కడే దేవుడని చాటుతారు. శివుడు సగుణ నిర్గుణ పరబ్రహ్మ. కాశీ యందు విశ్వేశ్వరుడు శ్రీశైలమందు మల్లికార్జునుడు, హిమాచలమందు గౌరీశంకరుడు. ఈ శైవాలయాలు శైవ వ్యాప్తిని తెలియజేస్తున్నాయి. శివునికి ఇతరులు సరిరారని సోమన ''శంకర దాసయ్య'' కథలో పేర్కొన్నాడు.
బసవేశ్వరుడు కర్ణాటక దేశంలో వీరశైవమును స్థాపిస్తే ఇతని చరిత్రను మొదట తెలుగులో బసవపురాణంగా పాల్కురికి సోమనాథుడు రచించగా తరువాత ఇది కన్నడములోనికి భాషాంతరీకరణ పొందింది. అదేవిధంగా పండితారాధ్య చరిత్ర కూడా కన్నడ భాషలోనికి తెలుగు నుండే ప్రయాణము చేసింది. శివకవుల మతావేశమునకు ఉదాహ రణగా బసవ పురాణములో ఒక సంఘటనను ఉదహరిం చవచ్చును. శివభక్తుడైన భృంగి ఒకమారు శివుని దర్శింప బోయెను. ఆ సమయంలో శివుడు పార్వతీ సమేతుడై ఉండగా శివునికి మాత్రమే నమస్కరించి భృంగి వెనుదిరిగి పోయెనట. శివునికే తప్ప ఇతరుల ముందు శిరస్సు వంచని మతావేశము వీరిది. పైవిధంగా సోమనాథుని రచనలు వీరశైవ మత స్వరూపం మత విద్వేషాలు, మత సంప్ర దాయాలు ప్రతిఫలిస్తూ ఆనాటి మత పరిస్థితుల్ని అవగాహన చేసుకొనుటకు దోహదమౌతున్నాయి. జాతి బేధాలకు ఏ మాత్రం తావివ్వని వీరశైవమతాన్ని పాల్కురికి సోమన అనుసరించాడు.
Wednesday, 17 May 2017
పాల్కురికి సోమన...
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment